English | Telugu

హీరోగా దేవిశ్రీ ప్రసాద్ ఎంట్రీ.. స్టార్స్ ని దాటుకొని వచ్చిన బిగ్ ప్రాజెక్ట్!

'ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది' అంటారు. అలాగే, ప్రతి కథ ఏ నటుడి దగ్గరకు వెళ్ళాలనేది ముందే రాసి ఉంటుంది అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపించే మాట. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ కథ ఎందరో హీరోలను దాటుకొని దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు చేరినట్లు తెలుస్తోంది. ఈ కథతో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. (Devi Sri Prasad)

కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 'బలగం' విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొంది.. ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత నాని హీరోగా 'ఎల్లమ్మ' అనే సినిమాని ప్రకటించాడు వేణు. అయితే నాని ఇతర సినిమాలతో బిజీ అవ్వడంతో.. ఈ ప్రాజెక్ట్ లోకి నితిన్ వచ్చాడు. ఆ తర్వాత నితిన్ నుంచి శర్వానంద్ కి, అటు నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ ప్రాజెక్ట్ వెళ్ళినట్లు వార్తలు వినిపించాయి. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. (Yellamma)

ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో సంగీతం దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్.. హీరోగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం వార్తలొచ్చాయి. కానీ, ఎందుకనో అది జరగలేదు. అలాంటిది ఇప్పుడు ఎందరో హీరోలను దాటుకొని వచ్చిన 'ఎల్లమ్మ' కథతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా న్యూస్ వినిపిస్తుంది. అదే నిజమైతే హీరోగా దేవిశ్రీ ప్రసాద్ కి సాలిడ్ ఎంట్రీ దొరికినట్లే.

'ఎల్లమ్మ' సినిమా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ హీరోయిన్ విషయంలోనూ సస్పెన్స్ నెలకొంది. సాయిపల్లవి, కీర్తి సురేష్ వంటి పేర్లు వినిపించాయి. మరి ఫైనల్ గా ఎవరి దగ్గరికి వెళ్తుందో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.