English | Telugu

మహేష్‌బాబు సినిమాల వల్లే అఖండ2 రిలీజ్‌ వాయిదా!

- ఆ రెండు సినిమాలే ప్ర‌ధాన కార‌ణం
- నిర్మాత‌ల‌కు, అభిమానుల‌కు షాక్‌
- ఒక‌రోజు ఆల‌స్యానికి కార‌ణ‌మిదే

కొద్ది గంటల్లో ప్రీమియర్స్‌ ద్వారా 'అఖండ2' చిత్రాన్ని వీక్షించేందుకు నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆకస్మికంగా ప్రీమియర్స్‌ రద్దు కావడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. తాజా సమాచారం మేరకు డిసెంబర్‌ 5న ప్రీమియర్స్‌, డిసెంబర్‌ 6న రెగ్యులర్‌ షోలు ప్రదర్శిస్తారని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ వంటి టాప్‌ హీరో సినిమా ఇలా అర్థాంతరం వాయిదా పడడం వెనుక కారణాల గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు.


ప్రీమియర్స్‌ని రద్దు చేయడం వెనుక టెక్నికల్‌ అంశాలు ఉన్నాయంటూ మొదట వినిపించినప్పటికీ అసలు కారణాలు ఆర్థికపరమైనవని తర్వాత తెలిసింది. ఇదిలా ఉంటే.. 'అఖండ2' రిలీజ్‌ వాయిదా పడడం వెనుక మహేష్‌బాబు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. 2014లో మహేష్‌బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌లో '1 నేనొక్కడినే', మహేష్‌బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో 'ఆగడు' చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాయి.


'1 నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాలను 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది. ఈ రెండు సినిమాలకు బాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ భాగస్వామిగా ఉంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలకు ఈ రెండు సినిమాలు నష్టాలను తెచ్చిపెట్టాయి. ఆ సందర్భంలోనే ఈరోస్‌కు 14 రీల్స్‌ సంస్థ 28 కోట్లు బకాయిపడినట్టు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని చెల్లించకుండా వాయిదా వేస్తూ వస్తున్న 14 రీల్స్‌ సంస్థపై ఈరోస్‌ కోర్టుకెక్కింది. దాని ఫలితంగానే 'అఖండ2' చిత్రం వాయిదా పడింది.


సరిగ్గా రిలీజ్‌ రేపు అనగా మద్రాస్‌ హైకోర్టులో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ పిటిషన్‌ దాఖలు చేయడం, దాన్ని స్వీకరించిన కోర్టు.. 'అఖండ2' చిత్రం రిలీజ్‌ని ఆపాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిపోయాయి. దీంతో చిత్ర నిర్మాతలే కాదు, సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు, అభిమానులు సైతం షాక్‌ అయ్యారు. ఎవరూ ఊహించని ఈ పరిణామం వల్ల ఒక భారీ సినిమా రిలీజ్‌కి అంతరాయం కలిగింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆర్థిక పరమైన లావాదేవీలను 14 రీల్స్‌ సంస్థ పూర్తి చేసిందని, ఇక రిలీజ్‌కి ఎలాంటి ఇబ్బందీ లేదని తెలుస్తోంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.