English | Telugu

'జటాధర' ట్రైలర్.. సుధీర్ బాబు విశ్వరూపం!

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'జటాధర'. ఎస్ కే జీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. (Jatadhara Trailer)

'జటాధర' ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివితో రూపొందిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. గుప్తనిధుల అంశాన్ని ముడిపెడుతూ.. దైవ శక్తికి, పిశాచానికి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంది. "పూర్వం ధనాన్ని భూమిలో దాచిపెట్టి.. మంత్రాలతో బంధనాలు వేసేవారు. ఆ బంధనాలలో అతి భయంకరమైనది పిశాచ బంధనం" అనే వాయిస్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. దెయ్యాలను నమ్మని ఘోస్ట్ హంటర్ గా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు. లంకె బిందెలకు కాపలాగా ఉండే ధన పిశాచిగా సోనాక్షి సిన్హా కనిపిస్తోంది. దెయ్యాలను నమ్మని హీరో.. ధన పిశాచితో తలపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? శివుడి ఆశీస్సులతో హీరో ఎలా పోరాడాడు? అనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. ఇక ట్రైలర్ చివరిలో నేల మీద పడుకొని రక్తం తాగుతున్నట్టుగా సుధీర్ బాబు పాత్రని చూపించడం సర్ ప్రైజింగ్ ఉంది. మొత్తానికి ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. విజువల్ గా కూడా బాగానే ఉంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.