English | Telugu

Akhanda 2 Teaser: మరి కాసేపట్లో రిలీజ్ అయ్యే అఖండ 2 టీజర్ హైలెట్స్ ఇవే 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)సిల్వర్ స్క్రీన్ పై పోషించిన క్యారెక్టర్స్ మరో హీరో పోషించలేదంటే అతిశయోక్తి కాదు. ఈ విషయాన్నీ చాలా మంది హీరోలు బహిరంగంగానే చెప్తుంటారు. సాంఘిక, పౌరాణిక, జానపద, ఫిక్షన్, ఫ్యాక్షన్, డేవోషనల్ కి సంబంధించిన చిత్రాల ద్వారా ఆయా క్యారెక్టర్స్ ని అద్భుతంగా పోషిస్తు అభిమానులు,ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్నాడు. అసలు బాలకృష్ణ ఒక క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసాడంటే సదరు క్యారక్టర్ మన మనస్సులో నుంచి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అంత చరిష్మా బాలకృష్ణ సొంతం.

బాలకృష్ణ ప్రస్తుతం 'అఖండ పార్ట్ 2'(Akhanda 2)తో బిజీగా ఉన్నాడు. అఖండ కి సీక్వెల్ కావడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu)ఇంకా అధికారంగా చెప్పకపోయినా పార్ట్ 2 లో బాలకృష డ్యూయల్ రోల్ అనేది గ్యారంటీ. మొదటి భాగం ఎండింగ్ లో అఘోర క్యారక్టర్ తో పాటు సోషల్ సర్వీస్ చేసే మరో క్యారక్టర్ కూడా ఉంది. దీంతో డ్యూయల్ రోల్ ఉండటం అనేది పక్కా. బాలకృష్ణ, బోయపాటి కి ఉన్నట్రాక్ రికార్డు కూడా అలాంటిందే. రీసెంట్ గా ఫిలిం సర్కిల్స్ లో సోషల్ సర్వీస్ చేసే క్యారక్టర్ ని హిందూపురం ఎంఎల్ఏ గా చూపించబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో వాస్తవం కూడా లేకపోలేదు. ఎందుకంటే మొదటి భాగంలో బాలకృష అనంతపురంలోనే ఉంటాడు. పైగా పేద ప్రజలని అండగా ఉంటు సంఘ విద్రోహ శక్తుల అంతు చూస్తుంటాడు. కాబట్టి ఆ క్యారక్టర్ ని అనంతపురం జిల్లాలోనే ఉన్న హిందుపురం ఎంఎల్ఏ గా మార్చడం పెద్ద విషయమేమి కాదు.

ఇక ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. రియల్ లైఫ్ లో బాలకృష్ణ గత మూడు పర్యాయాల నుంచి హిందూపురం ఎంఎల్ఏ గా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఫస్ట్ టైం మా బాలయ్య నిజజీవిత పాత్రని పోషిస్తున్నాడని, సిల్వర్ స్క్రీన్ పై ఆ మూమెంట్ సంచలనం సృష్టించడం ఖాయమనే కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి రిలీజ్ కాబోయే టీజర్ లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ టీజర్ లో అఘోర గురించి కాకుండా రెండో క్యారక్టర్ గురించే చెప్పనున్నారు. అఖండ పార్ట్ 2 డిసెంబర్ 5 న పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.