English | Telugu

ధనుష్ 50వ సినిమా దర్శకుడు ఎవరో తెలుసా?

వాస్తవానికి రజనీకాంత్ సూప‌ర్ స్టార్ అయిన తర్వాత కూడా హీరో అంటే ఇలాగా కూడా ఉంటారా? అని కొందరు భావించారు. ఇక తరువాత ధనుష్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు హీరోలంటే కండలు తిరిగి ఉంటాయి. మరీ బక్కపల‌చగా, సన్నగా వంటిపై కండే లేని ఈయ‌న హీరో ఏంటి? అని వేళాకోళం ఆడిన వారు కూడా చాలామందే ఉన్నారు. స‌న్న‌గా అస్థిపంజ‌రంలాగా ఉండే ధనుష్ హీరో ఏమిట‌ని కొందరు వేళాకోలంగా మాట్లాడి ఆట‌ప‌ట్టించేవారు కూడా. కానీ వారందరికీ ధనుష్ తన నటనతో, త‌న‌లోని మల్టీ టాలెంట్ తో సమాధానం చెప్పారు. కాగా అతి తక్కువ కాలంలోనే ఈయన 50 చిత్రాలను పూర్తి చేయబోతున్నారు. తెలుగులో హీరోలు ఇన్నేళ్ల తమ కెరీర్లో 20, 30 సినిమాలు కూడా చేయలేక అవస్థలు పడుతూ ఉంటే ధనుష్ వరుసగా సినిమాలు చేస్తూ 50 చిత్రాలకు చేరుకోవడం విశేషమ‌నే చెప్పాలి. ఇక ఈయన రజనీకాంత్ తర్వాత హాలీవుడ్ చిత్రంలో నటించిన ఘనతను సాధించారు. బాలీవుడ్ లో కూడా రెండు మూడు చిత్రాలు చేశాడు.

తాజాగా ధనుష్ 50వ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రంతో ధనుష్ నటుడిగా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయ‌న వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో వాతిగా విడుదల కానుంది. ఆ వెంటనే టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టునున్నారు. మరోవైపు దిల్ రాజు నిర్మాతగా శ్రీకారం దర్శకుడు కిషోర్ తో ఓ చిత్రం చేయబోతున్న‌ట్లు స‌మాచారం. ఇక ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో మాఫియా నేపథ్యంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన గ్యాంగ్ లీడర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీలో సందీప్ కిషన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక తాజాగా ధనుష్ 50వ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి ధనుష్ తానే స్వీయ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తన కెరీర్లో మైలురాయి ఇలాంటి 50వ‌ సినిమాని వేరొక దర్శకునికి ఇవ్వకుండా ధనుష్ తనలోని మేకర్ ను బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండడం విశేషం. ఈ సినిమా కూడా పీరియాడికల్ జోనర్ లోనే తెరకెక్కబోతున్నట్టు పోస్టర్ ని బట్టి అర్థమవుతుంది. ఈ పోస్ట‌ర్ లో బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్టరీల నుంచి వచ్చే భారీ పొగని ఎలివేట్ చేశారు. ఆ పరిసరాలు మురికివాడ‌లుగా ఉన్నాయి. దీన్నిబట్టి మురికివాడలో జరిగే కథాంశంగా ఈ మూవీ ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా ధ‌నుష్ కెరీర్ లోనే 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న సినిమా అంటే చిన్న విషయం కాదు అనే చెప్పాలి. మరి ఈ చిత్రంతో ధనుష్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు వేచి చూడాలి. ఇంకా ఈ సినిమాలో ఎస్ జె సూర్య, విష్ణు విశాల్ లు కూడా నటించనున్నారు.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.