English | Telugu

అల్లు అర్జున్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. అసలు సౌండ్ లేదేంటి..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అంత ప్రతిష్టాత్మక అవార్డు వస్తే.. మీడియా, సోషల్ మీడియా మారుమోగిపోవాలి కదా. అలాంటిది పెద్దగా హడావుడి లేదేంటని ఆశ్చర్యపోతున్నారా?. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. (Dadasaheb Phalke)

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద అత్యున్నత సినీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందిస్తున్నది. తెలుగులోఎల్.వి.ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కె.విశ్వనాథ్ వంటి దిగ్గజాలు ఈ అవార్డును అందుకున్నారు. తెలుగు నుండి చివరగా 2016 లో విశ్వనాథ్ కి ఈ గౌరవం దక్కింది. ఇక ఈ ఏడాదికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మలయాళ నటుడు మోహన్ లాల్ ని వరించింది. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును భారత ప్రభుత్వం ప్రతి ఏడాది జాతీయ అవార్డులతో పాటు అందిస్తుంది. సినీ రంగానికి సేవలందించిన దిగ్గజాలకు ఈ అవార్డును ఇస్తుంటారు. అయితే దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద ఓ ప్రైవేట్ సంస్థ కూడా అవార్డులు ఇస్తోంది. 'దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్' పేరుతో ప్రతి ఏడాది వేడుక నిర్వహించి.. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అల్లు అర్జున్ గెలుచుకున్నాడు.

Also Read: 'బాహుబలి: ది ఎపిక్' కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి!

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ రెండూ ఒకటే అనుకొని కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రభుత్వం ఇస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ అనేది ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కి వచ్చింది ప్రైవేట్ అవార్డు.

భవిష్యత్ లో అల్లు అర్జున్ భారత ప్రభుత్వం నుండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నా ఆశ్చర్యంలేదు. ఇప్పటికే పుష్ప సినిమాకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకొని, ఈ ఫీట్ సాధించిన మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు. భవిష్యత్ లో మరిన్ని సంచలనాలు సృష్టించి, ప్రభుత్వం నుండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకునే స్థాయికి ఎదుగుతాడేమో చూద్దాం.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.