English | Telugu

చిరంజీవి పేరు వాడితే చర్యలు తప్పవు.. టీమ్ సంచలన ప్రకటన!

టెక్నాలజీ పెరగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏఐ రాకతో సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఫేక్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఏఐ పుణ్యమా అని ఏవి ఫేకో, ఏవి ఒరిజినలో కూడా అర్థంకాని పరిస్థితి. వీటి వల్ల సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వారిని ట్రోల్ చేసేలా ఉంటే, మరికొన్ని వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉంటున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు న్యాయ పోరాటానికి దిగారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది. (Chiranjeevi)

తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వాయిస్ ఉపయోగించడం, ఏఐ క్రియేషన్స్ చేయడంపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నుండి ఉత్తర్వులు తెచ్చుకున్నారు చిరంజీవి. ఈ మేరకు చిరంజీవి టీమ్ కీలక ప్రకటన చేసింది. ట్రోల్స్, మార్ఫ్ లు, ఏఐ దుర్వినియోగం వంటివి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది.

"హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చిరంజీవి గారికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం ఎవరైనా చిరంజీవి వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్‌, ఏఐ క్రియేషన్ వంటివి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం నిషేధించబడింది. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 27 కి వాయిదా వేసింది. ట్రోలింగ్‌, మార్ఫింగ్‌, అభ్యంతరకర కంటెంట్‌ ప్రచారం, లేదా అనుమతిలేని వాణిజ్య వినియోగం పట్ల చట్టపరమైన చర్యలు ఉంటాయి." అని చిరంజీవి టీమ్ ప్రకటనలో పేర్కొంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.