English | Telugu

చిరంజీవి, బాబీ సినిమా అప్ డేట్.. ఆ ఇద్దరు హీరోయిన్స్ అదృష్టవంతులా! 

మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)షూటింగ్ లో పాల్గొంటున్నాడు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల కానుండటంతో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి 'బాబీ'(Bobby) దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో 'వాల్తేరు వీరయ్య' వంటి బిగ్గెస్ట్ హిట్ వచ్చి ఉండటంతో, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి.

బాబీ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే చిరంజీవి సరసన రాశి ఖన్నా(Raashi Khanna),మాళవిక మోహనన్(Malavika Mohanan)జతకట్టే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బాబీ ఈ ఇద్దరి హీరోయిన్స్ ని సంప్రదించాడని,వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికార ప్రకటన రానుందనే టాక్. రాశి ఖన్నా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో చేస్తుంది. దీంతో చిరంజీవితో చెయ్యడం ఖాయమైతే కనుక ఆమె కెరీర్ కి మరింత హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది.మాళవిక మోహనన్ కూడా ప్రస్తుతం ప్రభాస్ వన్ మాన్ షో 'ది రాజాసాబ్' లో చేస్తుంది. ఇప్పుడు చిరంజీవి, బాబీ చిత్రంలో కన్ఫార్మ్ అయితే ఆమె కెరీర్ కి మరింత హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరు తమ అందంతో, పెర్ ఫార్మెన్సు తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక చిరంజీవి, బాబీ సినిమా ఫుల్ మాస్ ఫ్లెడ్జెడ్ సబ్జెక్ట్ తో తెరకెక్కబోతుంది. వాల్తేరు వీరయ్యని మించిన కమర్షియల్ అంశాలు ఉండటమే కాకుండా, చిరంజీవి ని ఇంతవరకు ఎవరు చూపించని సరికొత్త మాస్ యాంగిల్ లో బాబీ చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. కె వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా చిరంజీవి నుంచి వస్తున్న 158 వ చిత్రం.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.