English | Telugu

అలా రిలీజ్‌ అవుతున్న మొదటి సినిమా అఖండ2.. నిర్మాతలు సేఫ్‌ అవుతారా?

కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గింది. దానికి కారణం.. ఆ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ మంచి ఫామ్‌లోకి రావడమే. థియేటర్లకు వెళ్ళకుండా ఇంటి నుంచే సినిమాలు చూడడం ప్రేక్షకులకు బాగా అలవాటైంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ స్టార్‌ హీరోల సినిమాలకు రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేసేవారు. దాంతో థియేట్రికల్‌ వసూళ్లు తగ్గినా ఓటీటీ ఇచ్చే అమౌంట్‌ నిర్మాతలకు ఊరట కలిగించేది.


ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమాకి సంబంధించిన లెక్కలు కూడా పూర్తిగా మారబోతున్నాయి. ఇకపై రిలీజ్‌ అయ్యే సినిమాలకు సంబంధించి కొత్త లెక్కల్ని అమలులోకి తెచ్చాయి ఓటీటీ సంస్థలు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఈ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. దానికి లోబడి ఉంటేనే సినిమాలను కొనుగోలు చేస్తోంది. నెట్‌ఫిక్స్‌ పెడుతున్న కండిషన్లకు నిర్మాతలు ఓకే చెబితేనే డీల్‌ ఓకే చేసుకుంటోంది.


సినిమా రిలీజ్‌కి ముందు చేసుకున్న అగ్రిమెంట్‌లో కొన్ని నిబంధనలను చేర్చింది నెట్‌ఫ్లిక్స్‌. సినిమా రిజల్ట్‌ని బట్టి అమౌంట్‌ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది. దీన్ని బట్టి సినిమాకి హిట్‌ టాక్‌ రాకపోతే అగ్రిమెంట్‌ ప్రకారం చెల్లించే మొత్తంలో 25 శాతం కోత విధిస్తారు. సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకొని కలెక్షన్లు బాగుంటే ముందుగా అనుకున్న మొత్తాన్ని ఎలాంటి కోత లేకుండా చెల్లిస్తారు.


ఈ కొత్త నిబంధన నిర్మాతలపై ఒత్తిడి తెస్తోంది. సినిమా విడుదలైన నాలుగు వారాలకే సినిమా ఓటీటీకి వచెయ్యడంతో థియేటర్లలో కలెక్షన్లు బాగా పడిపోతున్నాయి. దానివల్ల చాలా సినిమాలకు లభించే అమౌంట్‌ తగ్గుతుంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన 'అఖండ2' ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 5న విడుదల కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ విధించిన కొత్త నిబంధనలతో విడుదలవుతున్న మొదటి భారీ సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్‌ వస్తుంది? నెట్‌ఫ్లిక్స్‌ ఎంత ఎమౌంట్‌ చెల్లిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.