English | Telugu

'థాంక్యూ డియర్' ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్.. విడుదలకు ముందే పలు అవార్డులు సొంతం...

మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ లో కృష్ణ వంశీ వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన తోట శ్రీకాంత్ కుమార్ రచన & దర్శకత్వంలో పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా ఆగస్టు 1న విడుదల అవుతున్న చిత్రం 'థాంక్యూ డియర్'. ఈ చిత్రంలో హీరోయిన్ గా హెబ్బా పటేల్, హీరోగా త్రంత మూవీ ఫేమ్ ధనుష్ రఘుముద్రి, మరో హీరోయిన్ గా రేఖ నిరోషా నటిస్తున్నారు. వరల్డ్ బర్నింగ్ ఇష్యూ గురించి వివరించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్.. విడుదల కాకముందే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ప్రత్యేక ప్రదర్శన జరగడమే కాక 15th గోవా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ తో పాటు, బెంగళూరు ఇండియా ఆర్ట్ అండ్ లిటలేచర్ అసోసియేషన్, వెస్ట్ బెంగాల్ వెల్రెడ్ అసోసియేషన్ నుంచి హెబ్బా పటేల్ ఉత్తమ నటిగా, డెబ్యూ ప్రొడ్యూసర్ గా పప్పు బాలాజీ రెడ్డి, సహాయ నటీనటులుగా నాగ మహేష్ , రేఖ నిరోషా అవార్డ్స్ పొందారు. ఇటీవల విడుదలైన పాటకు, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రవి ప్రకాశ్, నాగ మహేష్, వీర శంకర్, ఛత్రపతి శేఖర్ తదితరులు నటించగా పిఎల్కే రెడ్డి డీఓపీగా పని చేశారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. విడుదల తేదీ దగ్గర పడిన సందర్భంగా ఈ చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ తోట మాట్లాడుతూ... "ఈ సినిమాను ప్రపంచంలో జరిగే ఒక బర్నింగ్ పాయింట్ను తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి ఫ్యామిలీ అంతా చూసే విధంగా చేసాము. నాకు సపోర్ట్ చేసిన నిర్మాత బాలాజీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చిత్రంలో నటించిన నటీనటులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమాలో కథ ఎంత ముఖ్యమో స్క్రీన్ ప్లే కూడా అంతే ముఖ్యం. ఈ సినిమా అంతా కట్ బ్యాక్ స్క్రీన్ ప్లే లో ఉండబోతుంది. ఒక మంచి సందేశం తో అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాను ఉండబోతుంది. చిత్రానికి ఇప్పటికే ఎన్నో అవార్డులు రావడం విశేషం. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.

నిర్మాత బాలాజీ మాట్లాడుతూ... "ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు అందరిని ఆకట్టుకుంటుంది అని అనుకుంటున్నాను. నటీనటులు, సాంకేతిక బృందం అంతా సినిమాకు బాగా సపోర్ట్ చేశారు" అన్నారు.

హీరో ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ... "నాకు తన తొలి చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకునికి నా ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గారితో అలాగే రేఖా నిరోషా గారితో కలిసి పని చేయడం అనేది సంతోషకరం. ఈ సినిమా నాకు స్పెషల్ గా ఉంటుంది. ఆగస్టు 1న మా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను" అన్నారు.

హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ... "నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకునికి ధన్యవాదాలు. నాతో కలిసి నటించిన ధనుష్ గారికి, హెబ్బా గారికి థాంక్స్. మా సినిమాను అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకులంతా థియేటర్లలో మా సినిమాను చూడాలని కోరుకుంటున్నాను" అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ పునీత్ మాట్లాడుతూ... "ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న థాంక్యూ డియర్ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను" అన్నారు.

సంగీత దర్శకుడు సుభాష్ మాట్లాడుతూ... "నాకు ఈ చిత్రానికి పని చేసేందుకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, నిర్మాత బాలాజీ గారికి నా ధన్యవాదాలు. బాలాజీ గారు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడంతోనే మేము బాగా పని చేయగలిగాము. ఇటువంటి మరెన్నో సినిమాలు ఆయన చేయాలని కోరుకుంటున్నాను" అంటూ ముగించారు.