English | Telugu
అశ్విన్ బాబు 'శివం భజే'.. రిలీజ్ ఎప్పుడంటే!
Updated : Jul 14, 2024
రాజు గారి గది, రాజు గారి గది2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరో అశ్విన్ బాబు. ప్రముఖ యాంకర్ ఓంకార్ కి సోదరుడు అశ్విన్ బాబు. ఇతను తన సొంతంగా హిట్ కొట్టాలని ఓ యునిక్ కాన్సెప్ట్ తో వస్తుంటాడు. ఆయితే అవి థియేటర్లలో ఆశించిన స్థాయిలో హిట్ అవ్వట్లేదు.
మరి ఓ కొత్త దర్శకుడితో మళ్ళీ వస్తున్న అశ్విన్ సినిమా వివరాలేంటో ఓసారి చూసేద్దాం. అప్సర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'శివం భజే'లో అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించారు. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, ఇనాయా సుల్తానా తదితరులు ఇతర పాత్రలు పోషించారు.వికాస్ బడిస సంగీతం అందించాడు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ తో అందరి దృష్టిని ఆకర్శించిన 'శివం భజే' మూవీని ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాంఢ్ రిలీజ్ చేయనున్నట్టు, ట్రైలర్ మరియు పాటల విడుదల గురించి వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాత మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
