English | Telugu

'రాజు వెడ్స్ రాంబాయి' అసలు కలెక్షన్స్ ఇవే..!

'రాజు వెడ్స్ రాంబాయి'కి షాకింగ్ కలెక్షన్స్
బడ్జెట్ రెండు కోట్లు
నాలుగు రోజుల్లో వచ్చింది ఎంతంటే..?

ఒక్కోసారి బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాలు సర్ ప్రైజ్ చేస్తుంటాయి. రీసెంట్ గా విడుదలైన 'రాజు వెడ్స్ రాంబాయి'(Raju Weds Rambai) గురించి ప్రస్తుతం తెగ చర్చ జరుగుతోంది. ఈ సినిమా సంచలన వసూళ్ళతో దూసుకుపోతోంది అంటున్నారు. అసలు ఈ 'రాజు వెడ్స్ రాంబాయి' కలెక్షన్స్ నిజంగా ఆ రేంజ్ లో ఉన్నాయా?

'లిటిల్ హార్ట్స్' తర్వాత ఈటీవీ విన్ నుండి వచ్చిన చిత్రం 'రాజు వెడ్స్ రాంబాయి'. అఖిల్ రాజ్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ.. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సుమారుగా రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి వీకెండ్ లోనే ఈ సినిమా రూ.7.28 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది.

ముఖ్యంగా తెలంగాణలో ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ.. ఒక్క నైజాం ఏరియాలోనే ఫస్ట్ వీకెండ్ లో రూ.5 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం.

Also Read: ధర్మేంద్ర ప్రస్థానం.. 19 ఏళ్ళకు మొదటి పెళ్ళి.. 50 రూపాయలు మొదటి సంపాదన!

చాలా సినిమాలు మొదటి వీకెండ్ పూర్తయ్యి, సోమవారం రాగానే స్లో అవుతుంటాయి. కానీ, 'రాజు వెడ్స్ రాంబాయి' మాత్రం డిస్టింక్షన్ లో మండే టెస్ట్ పాస్ అయింది. సోమవారం ఒక్క బుక్ మై షో యాప్ లోనే దాదాపు 29 వేల టికెట్లు బుక్ అయ్యాయి.

'రాజు వెడ్స్ రాంబాయి' మొదటి నాలుగు రోజుల్లో రూ.9.08 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొదటి రోజుతో పోలిస్తే, నాలుగో రోజు ఎక్కువ కలెక్ట్ చేయడం విశేషం. ఇదే జోరు కొనసాగితే.. ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర మరిన్ని సంచలనాలు సృష్టించేలా ఉంది.

రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిన్న సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం నిజంగా గొప్ప విషయమే. పైగా ఇప్పటిదాకా మెజారిటీ కలెక్షన్స్ తెలంగాణ నుండే వచ్చాయి. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ లోనూ సినిమా ఊపందుకుంటోంది. తెలంగాణ జోరుకి ఏపీ కూడా తోడైతే.. ఈ చిత్రం రికార్డు వసూళ్లు రాబట్టడం ఖాయం.

'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ టీమ్ అయితే ఫుల్ రన్ లో రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యంలేదు అంటోంది. మరి అది సాధ్యమవుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.