English | Telugu

నా క్యారక్టర్ ని పుష్ప తో పోల్చవద్దు.. పృథ్వీరాజ్ సుకుమారన్ అభ్యర్ధన 


-పుష్ప తో పోల్చకండి
-విలయాత్ బుద్ద తో హిట్ కొట్టబోతున్నాడా!
-ssmb 29 లో ఎలాంటి క్యారక్టర్
-అభిమానుల్లో భారీ అంచనాలు

సినిమా కోసమే పుట్టిన పాన్ ఇండియా కట్ అవుట్ 'పృథ్వీరాజ్ సుకుమారన్'(Prithviraj Sukumaran)హీరోగానే కాకుండా ఇతర హీరోల చిత్రాల్లోను ముఖ్య పాత్రలు పోషిస్తు తనదైన హవాని కొనసాగిస్తున్నాడు. పైగా ఆ చిత్రాలన్నీ ఆషామాషి చిత్రాలు కాదు. పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నవి. మేకర్స్ కూడా ఏరికోరి పృథ్వీ రాజ్ సుకుమారన్ ని తమ సినిమా కోసమే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న మహేష్, రాజమౌళిల 'వారణాసి'(Varanasi)నే అందుకు ఉదాహరణ. పృథ్వీరాజ్ హీరోగా ఈ నెల 21 న 'విలయాత్ బుద్ద'(Vilaayath Buddha)అనే మలయాళ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టబోతున్నాడు. ప్యూర్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుంది. ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉండటంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


పృథ్వీరాజ్ ఈ మూవీలో గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పటీనుంచే పుష్ప కి కాపీ అనే విమర్శలు సోషల్ మీడియాలో వచ్చాయి. టీజర్ లో సైతం 'నువ్వు పుష్ప అనుకుంటున్నావా' అనే డైలాగ్ ని కూడా చెప్పడం జరిగింది. రీసెంట్ గా 'విలయాత్ బుద్ద' ట్రైలర్ రిలీజయ్యింది.దీంతో మళ్ళీ పుష్ప కి కాపీ అనే విమర్శలు సోషల్ మీడియా వేదికగా జోరందుకున్నాయి. ఈ విషయంపై పృథ్వీ రాజ్ మాట్లాడుతు నా చిత్రానికి పుష్ప తో ఎలాంటి క్రియేటివ్ లింక్ లేదు. మూవీలోని నా క్యారక్టర్ 'డబుల్ మోహనన్'కి, 'పుష్ప రాజ్'కి ఎటువంటి పోలిక లేదు.


also read: సజ్జనార్ తో చిరంజీవి, నాగార్జున భేటీ.. అభిమానుల్లో పండుగ వాతావరణం


రెండు చిత్రాలు గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కడంతో పోలికలు సహజం. అయితే కథలు పూర్తిగా భిన్నమైనవి. జీ ఆర్ ఇందుగోపన్ రాసిన విలాయత్ బుద్ధ అనే మలయాళ నవల ఆధారంగా 'విలయాత్ బుద్ద రూపొందించబడింది. గతంలోను విలాయత్ బుద్ధ కి పుష్ప కి సంబంధం లేదని పృథ్వీరాజ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక విలాయత్ బుద్ధ' ని జయన్ నంబియార్(Jayan Nambiar) దర్శకత్వం వహించగా సేనాన్, అనూప్ నిర్మించారు. ప్రియం వద కృష్ణన్ హీరోయిన్ కాగా షమ్మీ, సూరజ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. జెక్స్ బిజోయ్ మ్యూజిక్ ని అందించాడు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.