English | Telugu

కొండా సురేఖపై కేసు విషయంలో నాగర్జున కీలక నిర్ణయం!

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబం పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో.. ఈ కేసు విషయంలో నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు.

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ.. గతేడాది అక్టోబర్ లో మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అందరూ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ఇక నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడిన సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతకాలంగా నాంపల్లి స్పెషల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది.

Also Read: కాంత మూవీ ఫస్ట్ రివ్యూ

అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా.. అక్కినేని కుటుంబం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని చెబుతూ కొండా సురేఖ క్షమాపణలు తెలిపారు.

కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో తాజాగా ఈ కేసును విత్ డ్రా చేసుకున్నారు నాగార్జున. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.