English | Telugu

ఈ సారైనా గట్టెక్కుతాడా! సెన్సార్ టాక్ ఇదే! 

వరుస పరాజయాలతో సతమవుతున్న మాస్ మహారాజా 'రవితేజ'(Raviteja)ఈ నెల 31 న తన అప్ కమింగ్ మూవీ 'మాస్ జాతర'(Mass Jathara)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుండటంతో పాటు, రవితేజ సరసన శ్రీలీల(Sreeleela)జతకట్టడం, ఇప్పటి వరకు భీమ్స్(Bheems)సంగీత సారధ్యంలో రిలీజ్ చేసిన సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ కావడంతో రవితేజ ఈ సారి ప్లాప్ ల గండం నుంచి గట్టెక్కినట్టే అనే మాటలు ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా మాస్ జాతర కి సంబంధించిన సెన్సార్ వర్క్ పూర్తయ్యింది. యూ/ఏ సర్టిఫికెట్ ని పొందగా 160 నిముషాల నిడివితో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. సెన్సార్ జరిగిన విషయాన్నీచిత్రబృందం అధికారకంగా ప్రకటించడంతో పాటు 'మాస్ ఫన్ అండ్ యాక్షన్ ఒక దానిలోనే. ఎంటర్ టైన్ మెంట్ మాస్ వేవ్ ని థియేటర్ లో ఆస్వాదించండంటు' ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా టాక్.

మాస్ జాతరని అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చినట్టుగా రూపొందించామని నూతన దర్శకుడు భాను బోగవరపు(Bhanu Bogavarapu)పలు ఇంటర్వూస్ లో చెప్తు వస్తున్నాడు. రవితేజతో పాటు నిర్మాత నాగవంశీ కూడా ఫలితంపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర, నితీష్ నిర్మల్, రీతు పి సూద్ ప్రధాన పాత్రలని పోషించగా ట్రైలర్ ఈ నెల 27 న విడుదల కానుంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.