English | Telugu

'బాహుబలి ది ఎపిక్'.. మహేష్ కొడుకు గౌతమ్ షాకింగ్ రివ్యూ!

- మొదలైన 'బాహుబలి ది ఎపిక్' సందడి
- ఓవర్సీస్ లో మూవీ చూసిన గౌతమ్
- మాటల్లేవన్న మహేష్ కుమారుడు
- SSMB29 గురించి అడిగితే..?

బాహుబలి సందడి మరోసారి థియేటర్లలో కనిపిస్తోంది. బాహుబలి రెండు భాగాలను కలిపి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ల జోరు కనిపిస్తోంది. తాజాగా 'బాహుబలి ది ఎపిక్'పై మహేష్ బాబు తనయుడు గౌతమ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. (Baahubali The Epic)

ఓవర్సీస్ లో 'బాహుబలి ది ఎపిక్' సినిమా చూసిన గౌతమ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. "వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ లో 'బాహుబలి ది ఎపిక్' చూడటం అనేది మరిచిపోలేని అనుభవం. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవడం కోసం రెండేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరంలేదు(నవ్వుతూ). సినిమా అద్భుతంగా ఉంది. మన తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్ వైడ్ గా ఇంత ఆదరణ దక్కడం సంతోషంగా ఉంది. ఇది నిజంగానే ఎపిక్ మూవీ. ప్రతి సెకన్ గూస్ బంప్స్ వస్తున్నాయి. దీనిని బిగ్ స్క్రీన్ పై చూడటం ఓ క్రేజీ ఫీలింగ్. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను." అని గౌతమ్ అన్నాడు.

కాగా, మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన తండ్రి నటిస్తున్న ఈ సినిమా గురించి తనకేమీ తెలియదని, తానేమీ చెప్పలేనని సరదాగా చెప్పి తప్పించుకున్నాడు గౌతమ్.

Also Read: 'బాహుబలి ది ఎపిక్' యూఎస్ రివ్యూ..!

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.