English | Telugu

ఇడ్లీ కొట్టు ఓటిటిలోకి వచ్చేసింది.. కానీ మీరు ఏం చేయాలో తెలుసా!

- ఇడ్లీ కొట్టు ఓటిటిలో
- ధనుష్ నట విశ్వరూపం
- ఇడ్లీ కొట్టు కథ ఏంటి?
- నిత్యామీనన్, షాలిని పాండే క్యారెక్టర్స్ పరిస్థితి


స్టార్ స్టేటస్ కోసం పాకులాడకుండా సిల్వర్ స్క్రీన్ పై ప్రయోగాలు చెయ్యడంలో ధనుష్(Dhanush)మొదటి వరుసలో ఉంటాడు. కానీ ప్రేక్షకులు స్టార్ స్టేటస్ ని కట్టబెట్టడంలో ఏ మాత్రం ఆలోచించలేదు. ధనుష్ ఒక క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసాడంటే ధనుష్ మనకి కనపడడు. మనకి తెలిసిన పొరుగింటి వ్యక్తి కనిపిస్తాడు. ధనుష్ పెర్ ఫార్మెన్స్ కి ఉన్న స్పెషాలిటీ అదే. అభిమాన ఘనం కూడా ఈ విషయంలో ధనుష్ వెనకే నడుస్తుంది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా తన సత్తా చాటుతు వస్తున్నాడు.

విజయదశమి కానుకగా అక్టోబర్ 1 న 'ఇడ్లి కొట్టు'(Idli Kottu)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో 'ఇడ్లి కడై'(Idli kadai)పేరుతో రిలీజయ్యింది. రెండు చోట్ల కూడా సినిమా బాగుందనే టాక్ వచ్చినా, కల్లెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. ఇప్పుడు ఈ మూవీ సైలెంట్ గా ఓటిటి లోకి అడుగుపెట్టింది. నెట్ ఫ్లిక్స్(Net Flix)వేదికగా ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఓటిటి మూవీ లవర్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. థియేటర్స్ లో మిస్ అయిన వారు కూడా ఓటిటిలో చూసి ఆనందించవచ్చు. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి అసభ్యతకి తావు లేకుండా ఇంటిల్లిపాది చూసేలా సన్నివేశాలు ఉంటాయి. కొన్ని సన్నివేశాల్లో మనకి తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. మన పూర్వీకుల గతాన్ని కూడా గుర్తుచేస్తుంది.

Also Read: హీరోయిన్ గా పరిచయమవుతున్న మహేష్ బాబు మేనకోడలు.. పిక్స్ వైరల్


క్యారెక్టర్స్ పరంగా వస్తే తన ఆశయాన్ని తన కొడుకు నెరవేర్చాలని అనుకునే తండ్రి క్యారక్టర్ లో రాజ్ కిరణ్, కొడుకు క్యారక్టర్ లో ధనుష్ ల నటన ప్రతి ఒక్కర్ని కట్టిపడేస్తుంది. డబ్బు ఉందన్నా అహంకారంతో, స్వార్ధంతో ఎదుటివారి జీవితాలని నాశనం చేయాలనుకునే క్యారక్టర్ లలో సత్యరాజ్, అరుణ్ విజయ్ లు జీవించారు. పైగా ఈ ఇద్దరు కూడా తండ్రి కొడుకులే. హీరోయిన్స్ గా చేసిన నిత్యామీనన్(Nithya Menon),షాలిని పాండే(Shalini Pandey)క్యారెక్టర్స్ కి సంబంధించి ధనుష్ తీసుకున్న నిర్ణయం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నటుడుగానే కాదు దర్శకుడుగా, నిర్మాతగాను ఇడ్లీ కొట్టు ద్వారా ధనుష్ మెప్పించాడని చెప్పవచ్చు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.