English | Telugu

అసలు ఈ భీమ్స్ ఎవరు!.. చనిపోయేంత పరిస్థితి ఎందుకు వచ్చింది 

- ఫ్యామిలీ తో సహా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నా
- రవితేజ సార్ దేవుడు
- మాస్ మహారాజా ప్రీ రిలీజ్ హైలెట్స్ ఇవే
- భీమ్స్ స్పీచ్ వైరల్


టాలెంట్ ఉండి తనని నమ్ముకున్న వాళ్లకి తెలుగు సినిమా కళామతల్లి ఎప్పుడు అండగా ఉండటంతో పాటు వాళ్లకంటు ఒక టైంని ఇస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు. ఇందుకు తాజా ఉదాహరణ ప్రముఖ సంగీత దర్శకుడు 'భీమ్స్ సిసిరోలియో'(Bheems Ceciroleo). మాస్, క్లాస్, ఫ్యామిలీ, ఫోక్ సాంగ్స్ లో తనదైన శైలిలో దూసుపోతున్నాడు. నవంబర్ 1 న మాస్ మహారాజా రవితేజ తో చేసిన తన కొత్త చిత్రం 'మాస్ జాతర'(Mass Jathara)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో భీమ్స్ మాట్లాడుతు రవితేజ సార్ తో చేసిన థమాకా ఆఫర్ రావడానికి ముందు ఇంటి అద్దె ఎలా కట్టాలి. పిల్లల్ని ఎలా చదివించుకోవాలి. అసలు రేపు ఎలా బతకాలి అని భార్య పిల్లలతో చనిపోదామని అనుకున్నాను.

అలాంటి చిట్టచివరి క్షణంలో ఉన్నప్పుడు ఒక రాముడిలా, జీసస్ లా, అల్లా గా తిరుపతి వెంకటేశ్వర స్వామిలా రవితేజ(Raviteja)గారు నాకోసం నిలబడ్డారు. రవితేజ సార్ లేకపోతే నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకునే వాళ్లమని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో భీమ్స్ ఎవరనే చర్చ జరుగుతుంది.

. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం భీమ్స్ స్వస్థలం. సంగీత దర్శకుడి కంటే ముందు పాటల రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2003 లో రాజశేఖర్, ఎన్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'ఆయుధం' మూవీలోని 'ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే' అనే పాటని రాసాడు. ఈ సాంగ్ నేటికీ చాలా చోట్ల మారుమోగిపోవడమే కాకుండా సదరు పాటలోని లిరిక్స్ ప్రతి ఒక్కరు పాడుకునే విధంగా అచ్చ తెలుగు పదాల్లో ఉంటాయి.ఆ తర్వాత 2011 లో సీమటపాకాయ అనే చిత్రంలో ఒక పాట రాసాడు.

Also read: హీరోలకి నిర్మాతలకి షాక్ ఇచ్చిన సిఎం


ఇక 2012 లో అల్లరి నరేష్, శర్వానంద్ హీరోలుగా వచ్చిన 'నువ్వా నేనా' అనే చిత్రంతో సంగీత దర్శకుడుగా మారాడు. ఈ చిత్రంలోని 'బ్లాక్ బెర్రీ' సాంగ్ చాలా పాపులర్. ఒక్కసారిగా భీమ్స్ ఎవరని ఇండస్ట్రీ మొత్తం అనుకుంది. ఈ చిత్రం నుంచి థమాకా వరకు భీమ్స్ సుమారు పద్నాలుగు సినిమాల దాకా సంగీతాన్ని అందించాడు. అందులో రవితేజ తో చేసిన బెంగాల్ టైగర్ తప్ప మిగతా సినిమాలన్నీ ఒక మోస్తరు హీరోలవే. పైగా సక్సెస్ కూడా కాలేదు.

సినిమా సక్సెస్ అయితేనే మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా పేరుతో పాటు డబ్బు వస్తుంది. అందుకే తన పర్సనల్ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి రవితేజ అందించిన థమాకా చాలా స్పెషల్. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం తో అగ్ర శ్రేణి సంగీత దర్శకుడిగా మారాడు. ఇప్పుడు ఏకంగా చిరంజీవితో అవకాశం కొట్టి మీసాల పిల్ల సాంగ్ తో ట్రెండ్ సెట్టర్ గా మారాడు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.