English | Telugu

ఆ హీరోల కొత్త సినిమాల రేంజ్ లో 'బాహుబలి' రీ రిలీజ్ బిజినెస్!

రీ రిలీజ్ సినిమాలు రూ.10 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తేనే గొప్ప. అలాంటిది, రీ రిలీజ్ అవుతున్న ఓ మూవీ.. తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.30 కోట్లకు పైగా బిజినెస్ చేస్తే?. ఇప్పుడు 'బాహుబలి' అలాంటి ఫీట్ నే సాధించింది. (Baahubali: The Epic)

'బాహుబలి' సినిమా రెండు భాగాలను కలిపి, ఒక భాగంగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న విడుదల కానున్న 'బాహుబలి: ది ఎపిక్' కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రేడ్ వర్గాలు కూడా ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబడుతుందని అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది.

నైజాంలో రూ.17 కోట్లు, సీడెడ్ లో రూ.4.5 కోట్లు, ఆంధ్రాలో రూ.15 కోట్లు చొప్పున.. తెలుగు రాష్ట్రాల్లో 'బాహుబలి: ది ఎపిక్' ఏకంగా రూ.36.5 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.37 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది.

సాధారణంగా నాని, విజయ్ దేవరకొండ వంటి యంగ్ స్టార్ల కొత్త సినిమాలు.. తెలుగు స్టేట్స్ లో ఈ రేంజ్ బిజినెస్ చేస్తుంటాయి. అలాంటిది, ఒక రీ రిలీజ్ మూవీ.. ఈ రేంజ్ బిజినెస్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే 'బాహుబలి' కాబట్టే ఇది సాధ్యమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

'బాహుబలి: ది ఎపిక్'కి సంబంధించిన బిజినెస్ లెక్కలు వింటుంటే.. ఈ సినిమా 100 కోట్లు కాదు, 200 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యంలేదు అనిపిస్తోంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.