English | Telugu

ఎవరు వన్ మ్యాన్ షో

ఐకాన్ స్టార్ట్ 'అల్లుఅర్జున్'(Allu Arjun)ప్రస్తుతం 'అట్లీ'(Atlee Kumar)దర్శకత్వంలో చేస్తున్న మూవీతో బిజీగా ఉన్నాడు. సాంకేతిక పరంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ మూవీపై పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులతో పాటుప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతవరకు సిల్వర్ స్క్రీన్ పై పోషించని ఒక సరికొత్త క్యారక్టర్ లో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు.

రీసెంట్ గా అల్లు అర్జున్ ఎక్స్(X)వేదికగా కాంతార చాప్టర్ 1(Kantara chapter 1)గురించి స్పందిస్తు 'కాంతార చూసి ఆశ్చర్యపోయాను. రైటర్, దర్శకుడు, హీరోగా రిషబ్ శెట్టి అన్నిట్లోనూ ది బెస్ట్ ఇచ్చారు. ఇది వన్ మాన్ షో. మూవీలో చేసిన ప్రతి ఒక్కరు వారి క్యారెక్టర్స్ కి వంద శాతం న్యాయం చేశారు. సాంకేతిక నిపుణల అత్యుత్తమ పని తీరు ప్రతి సన్నివేశంలో కనిపించింది. ఇంత గొప్ప సినిమాని నిర్మించినందుకు హోంబులే ఫిలిమ్స్ కి అభినందనలు అని ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ పై రిషబ్ శెట్టి స్పందిస్తు బన్నీ కి కృతజ్ఞతలు తెలిపాడు.

ఇక కాంతార చాప్టర్ 1 నాలగవ వారంలో కూడా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతుంది. ఇప్పటి వరకు సుమారు 818 కోట్ల రూపాయల గ్రాస్ ని సాధించి,ఈ సంవత్సరంలో ఆ ఘనతని సాధించిన మొట్టమొదటి చిత్రంగా నిలిచింది. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1780 కోట్ల రూపాయలు రాబట్టిన విషయం తెలిసిందే.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.