English | Telugu

ఇటలీ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులకు లైన్ క్లియర్

ఇటలీ నుంచి వచ్చి ఛత్తీస్ గడ్ బోర్డర్ లో ఆగిపోయిన తెలుగు విద్యార్థులకు లైన్ క్లియర్ అయింది. 33 మంది తెలుగు విద్యార్థులకు ఏపీకి రప్పించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఏపీ చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్ని చొరవతో సమస్య పరిష్కారం అయింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగు విద్యార్థులకు విముక్తి దొరికింది. రంగంలోకి దిగిన డిజిపి గౌతం సవాంగ్‌ , సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి క్రిష్ణబాబు. రాయ్ పూర్ , జగదల్ పూర్ మీదుగా రేపటికి వైజాగ్ చేరుకోనున్న 33 మంది విద్యార్థులు. వీరంతా క్షేమంగా ఏపీకి చేరుకునేందుకు ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.