English | Telugu
కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలపై పూర్తి నిషేధం
Updated : Apr 26, 2020
* అత్యవసర సేవలైనా సరే అనుమతించేది లేదు...
* ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులకూ 'నో పర్మిషన్'
రెండు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసినట్టు రెండు జిల్లాల పోలీసులు ప్రకటించారు. పులిగడ్డ పెనుమూడి వారథి వద్ద రెండు జిల్లాల గుండా ప్రయాణాలు చేస్తున్న ప్రయాణీకులను అడ్డుకుని నిబంధనలు తెలియచేస్తున్న అవనిగడ్డ (కృష్ణాజిల్లా), రేపల్లె (గుంటూరు జిల్లా) పోలీసులు. అత్యవసర సేవల కోసం కూడా రెండు జిల్లాల మధ్య రాకపోకలను బంద్ చేసిన అధికారులు, ఏ జిల్లా వాసులు ఆ జిల్లాల్లోనే ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాలో కరోనా విశ్వరూపం దాలుస్తున్న నేపథ్యంలో రెండు జిల్లాల మధ్య రాకపోకలపై నిషేధం విధించారు. రెండు జిల్లాల గుండా రాకపోకలు సాగించే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులన్ని కూడా అనుమతించే ప్రసక్తే లేదంటున్న అధికారులు.