English | Telugu
కరోనాతో బెంబేలు.. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలపై పూర్తిగా నిషేధం
Updated : Apr 15, 2020
కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రాకపోకలపైనా నిషేధం విధిస్తున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ వద్ద సమీపంలోని పులిగడ్డ -పెనుమూడి వారథి వద్ద రెండు జిల్లాల గుండా ప్రయాణాలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. వీరికి ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని పోలీసులు చెబుతున్నారు. అత్యవసర సేవల కోసం కూడా రెండు జిల్లాల మధ్య రాకపోకలను అధికారులు బంద్ చేశారు. ఏ జిల్లా వాసులు ఆ జిల్లాల్లోనే ఉండాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగులను సైతం అనుమతించేది లేదని పోలీసులు చెప్తున్నారు.