ఏపీలో కరోనా కేసుల తాజా బులెటిన్ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో 9,739 శాంపిల్స్ని పరీక్షించగా 57 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2339 కి చేరింది. గత 24 గంటల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఒకరు, కర్నూలు జిల్లాకు చెందిన వారు ఒకరు ఉన్నారు. దీంతో, ఇప్పటివరకు ఏపీలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 52కి చేరింది. తాజాగా 69 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఇప్పటి వరకు మొత్తం 1596 మంది డిశ్చార్జ్ కాగా, 691 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.