English | Telugu
రూ.100 కోట్ల అజ్ఞాత విరాళాలు.. దేశంలో రెండో స్థానంలో వైసీపీ!!
Updated : May 19, 2020
కేంద్ర ఎన్నికల సంఘానికి దేశంలోని 23 ప్రాంతీయ పార్టీలు విరాళాల విషయంపై నివేదికలు సమర్పించాయి. ప్రాంతీయ పార్టీల ఆదాయ మార్గాలకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 2018-19 సంవత్సరంలో అన్ని ప్రాంతీయ పార్టీలకు కలిపి 885.956 కోట్ల విరాళాలు వచ్చాయి. అయితే, ఇందులో 54.32 శాతం(రూ.481.276 కోట్లు) అజ్ఞాత విరాళాలే ఉన్నాయని తేలింది. అజ్ఞాత విరాళాలు అందుతున్న పార్టీల్లో ఒడిశాలోని బీజేడీ 213 కోట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో రూ.100 కోట్లతో వైసీపీ నిలిచింది. ఇక 37.78 కోట్లతో టీడీపీ ఐదో స్థానంలో నిలిచింది.
1. బీజేడీ రూ.213.54 కోట్లు
2. వైసీపీ 100.50 కోట్లు
3. శివసేన 60.73 కోట్లు
4. జేడీఎస్ 39.13 కోట్లు
5. టీడీపీ 37.78 కోట్లు