English | Telugu
ఏపీ లో 603 కు చేరిన పాజిటివ్ కేసులు
Updated : Apr 18, 2020
కోవిడ్ –19 నివారణ చర్యలపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, వినూత్న మార్కెటింగ్ విధానాలపై మార్కెటింగ్శాఖ అగ్రెసివ్గా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. నిన్న ఒక్కరోజే ల్యాబ్లు, ట్రూనాట్ మిషన్ల ద్వారా 4వేలకు పైగా పరీక్షలు చేశామన్న అధికారులు. ర్యాపిడ్ పరికరాలు, స్క్రీనింగ్ కోసం వాడే కొత్త పరికరాల సహాయంతో గణనీయంగా పరీక్షల సామర్థ్యం పెరుగుతుందన్న అధికారులు. కోవిడ్ పరిస్థితులకు ముందు తిరుపతిలో ఒకటే ల్యాబ్.. ఆ తర్వాత వీటి సంఖ్య 7కు పెంచగలిగామన్న అధికారులు. వారం రోజుల్లో ల్యాబుల సంఖ్య 12కు పెంచుతున్నామన్న అధికారులు.