English | Telugu

జ్యోతి ప్రజ్వలనకు పీఠాధిపతుల పిలుపు

ఈ రాత్రి 9 గంటలకు జ్యోతిని వెలిగించి, దేశ ఖ్యాతిని పెంచాలని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి, అలాగే, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర పిలుపునిచ్చారు. జ్యోతిని ప్రజ్వలించాలన్న ప్రధాని మోడీ పిలుపు దేవీ సంపదతో కూడినదని స్వామి స్వాత్మానందేంద్ర చెపితే, జాతి లో సమైక్య స్ఫూర్తికి ప్రధాని పిలుపు ఒక సూచిక అని చినజీయర్ వివరించారు. కరోనా మహమ్మారిని అంతమొందించడానికి అంతా సైనికుల్లా కదిలి జ్యోతిని వెలిగించాలని స్వామి స్వాత్మానందేంద్ర పిలుపునిచ్చారు. భారతావనికి నష్టం వాటిల్లకుండా ఐక్యమత్యంతో, విశాల హృదయంతో, బుద్ధి వికాసంతో కలిసి కదలాలనీ, ఈ సామూహిక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అందుకు పీఠిక కావాలనీ ఇద్దరు పీఠాధిపతులు అభిలాష, ఆకాంక్ష వ్యక్తం చేశారు.