English | Telugu
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
Updated : May 21, 2020
లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతాలు మాత్రమే జగన్ సర్కార్ చెల్లించింది. లాక్ డౌన్లో సడలింపులు చేయడంతో ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించింది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.