English | Telugu
ఏపీ రెడ్ జోన్లను కేంద్రం నమ్మలేదా? హాట్ స్పాట్ల ప్రకటన వెనుక కథేంటి?
Updated : Apr 16, 2020
ఏపీలో అంతకుముందే కరోనా వైరస్ పాటిజివ్ కేసులు నమోదైన 133 ప్రాంతాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించి చేతులు దులుపుకుందామని భావించిన జగన్ సర్కారుకు కేంద్రం చేసిన హాట్ స్పాట్ల ప్రకటన మింగుడు పడటం లేదనే చెప్పవచ్చు. రెడ్ జోన్లలో లాక్ డౌన్ ఉంచి మిగతా ప్రాంతాల్లో ఏప్రిల్ 14 తర్వాత సడలించాలని భావించిన జగన్ సర్కారు.. ఇప్పుడు కేంద్రం చేసిన ప్రకటనతో కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతోందని అర్ధమవుతోంది. అలాగని కేంద్రంతో ఘర్షణకు దిగే పరిస్ధితి లేదు. కాబట్టి ఏప్రిల్ 20 తర్వాత హాట్ స్పాట్లుగా గుర్తించిన 11 జిల్లాలు మినహాయించి కేవలం శ్రీకాకుళం, విజయనగరం రెండు జిల్లాల్లోనే లాక్ డౌన్ ను సడలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అలాగని అక్కడా పూర్తి స్ధాయిలో లాక్ డౌన్ సడలించే పరిస్ధితి లేదు. కేవలం పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు, మైనింగ్ వంటి వాటికే అనుమతులు ఇవ్వడం ద్వారా తనకు అనుకూలమైన పరిస్ధితిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.