English | Telugu
జగన్ కు కరెంట్ షాక్!!
Updated : Apr 22, 2020
ప్రధాని మోడీ... జగన్ కు ఊహించని షాక్ ఇచ్చారు. 2003 నాటి విద్యుత్ చట్టాన్ని మార్చడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. పాత చట్టానికి దుమ్ము దులిపి..: మార్చి18, 1910న ఏర్పాటు చేసిన భారతీయ విద్యుత్ ఆక్ట్ -1910 (ఆక్ట్ నెం.9)ని వ్యూహాత్మకంగా కేంద్రం అటకపై నుంచి దింపి, దుమ్ము దులిపి బయటకు తీసింది. ఈ చట్టంతో రూపాంతరం చెందిన 2003 విద్యుత్తు చట్టంలో నిబంధనలు మార్చాలని భావించింది.
21 రోజుల్లో ఇందుకోసం ఏకంగా ఓ కొత్త చట్టాన్ని కొంచెం గట్టిగా తీసుకు రాబోతున్నారు. ’21 రోజుల్లో అంటే మే8 వరకు అభ్యంతరాలు, సలహాలు చెప్పండంటూ ఓ నోటిఫికేషన్ కూడా ఈమేరకు జారీ అయింది.
ఈ సవరణ చట్టం మేరకు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సరే, పీపీఏలకు కట్టుబడి ఉండాల్సిందే… పీపీఏల అమలును పర్యవేక్షించేందుకు ఎలక్ట్రిసిటీ కంట్రాక్ట్ ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది అమల్లోకి వస్తే జగన్ ఆలోచనలకు బ్రేక్యే. అసలు జగన్ ఏం చేయాలనుకున్నారు?
జగన్ సి.ఎం.కాగానే చేసిన తొలి అధికార ప్రకటన ‘రాష్ట్రంలో చంద్రబాబు అడ్డగోలు కమీషన్ల కక్కుర్తితో పవన విద్యుత్తు, సౌరవిద్యుత్తు కొనుగోళ్లకు అసాధరణ రేట్లను ఫిక్స్ చేశాడు, దానివల్ల ఖజానా గుల్లయిపోతున్నది, మేం ఆ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) మొత్తం సమీక్షించి, రేట్లు తగ్గిస్తాం’ అనేది జగన్ ప్రకటన సారాంశం. పవన విద్యుత్తు, సౌరవిద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించిన డబ్బు చెల్లింపులు ఆపేశారు. సుమారు 40 ప్లాంట్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.
అయితే కేంద్రం కొత్తగా చేయబోతున్న చట్టంలో మార్పులు ఏమిటంటే? పవన, సౌర (పునరుత్పాదక) విద్యుత్తును ఒప్పందాల్లో ఉన్నట్టుగా కొనాల్సిందే.! అలా కొనకపోతే యూనిట్కు ఏకంగా 50 పైసల చొప్పున కరెంటు పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి డిస్కం ఏ సంవత్సరం లెక్కల్ని ఆ సంవత్సరమే తేల్చేయాలి. భారాన్ని వచ్చే సంవత్సరంలో వినియోగదారులకు వడ్డించటానికి వీల్లేదు.
ఇప్పుడు క్రాస్ సబ్సిడీ, సర్కారు సబ్సిడీ కలిసి గృహ వినియోగదారులకు కొంత రిలీఫ్ ఇస్తున్నాయి. ప్రభుత్వమే డిస్కమ్స్ కు సబ్సిడీ చెల్లిస్తుంది.
అయితే ఇకపై వంట గ్యాస్లో ఇస్తున్నట్టే… వాస్తవ కరెంటు ధరను మన దగ్గర వసూలు చేస్తారు. తరువాత కొంత సబ్సిడీని నేరుగా (బిల్లు మొత్తం, స్లాబు, కేటగిరీలను బట్టి) మన బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు.
వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తును భారీగా దుర్వినియోగం, సబ్సిడీ లెక్కల్లో ‘గోల్ మాల్’ జరుగుతుండటంతో మొత్తం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడతారు. ఆ లెక్కల్ని పక్కాగా రికార్డ్ చేస్తారు. పెద్ద పెద్ద ట్రాన్స్ మిషన్ లైన్స్, సబ్ స్టేషన్ల మెయింటెనెన్స్ ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేస్తారు.
ప్రాంతాల వారీగా కరెంటును పంపిణీ చేసే కంట్రాక్టులను ప్రైవేటు సంస్థలకు ఇస్తారు. ఇది కరెంటు రంగం రూపురేఖల్నే మార్చేయబోతున్నది.
విద్యుత్ కాంట్రాక్టు ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీ రెగ్యులేటరీ కమిషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తున్నాయి.
ఇకపై కేంద్రంలోని ‘విద్యుత్ కాంట్రాక్టు ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీ కమిటీ’ ఈ నియామకాల్ని చేస్తుంది.
ఈ కమిటీలో సుప్రీంకోర్టు జడ్జి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.
పీపీఏలపై సమీక్ష కోసం ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీ (హెచ్ఎల్ఎన్సీ)ని నియమిస్తూ ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 63ను రద్దు చేయాలని 40కి పైగా విద్యుదుత్పత్తి సంస్థలు కోరుతున్నాయి.