గొప్ప విలువలకు పట్టంగట్టిన కారా మాస్టారు
కథా రచనలోనూ, నిజజీవితంలోనూ కాళీపట్నం రామా రావు మాస్టారికి గొప్ప విలువలు ఉన్నాయి. వాటిని ప్రతి వ్యక్తి అలవర్చు కోవాలి. శ్రీకాకుళం సాహితి, సాహితీ స్రవంతి సంస్థలు ఆదివారం స్థానిక బాపూజీ కళామందిర్ లో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాళీపట్నం రామారావు శత జయంతి కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి.
Nov 4, 2024
ఒక నది ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు చాలా కొమ్మలతో విస్తరించి ఉండేది. కాని దానికి గర్వం ఎక్కువ నేనే అందరికన్నాగొప్ప అని అనుకుంటూ ఉండేది. ఒక రోజు నదిలో ఉన్న చిన్న మొక్కలతో మాట్లాడుతూ మీరు నాకు రోజు తలొంచి నమస్కారం చేయాలి, ఎందుకంటే మీరు నాకన్న బలహీనమైన వారు అంటుంది. అందుకు ఆ చిన్న మొక్కలు మేము నీకన్నా చిన్నవారమే కాని ఎవరి గొప్పదనము వారికి ఉంటుంది.
Oct 30, 2024
పొగడపూల పరిమళమే.. విమల వగరు జ్ఞాపకాల నవ్వు
కల్లోలిత ప్రాంతాలను కవిత్వంగా మార్చగలదు. విరిగిపోయిన కలలకు కట్టు కట్టగలదు. నిరాశల నీడల మీద నీలిపూల వాన కురిపించగలదు.
Oct 21, 2024
అవిటితనం శరీరానికే కానీ మనసుకు కాదు!
శాతవాహన ఎక్స్ ప్రెస్ స్టేషన్లో వచ్చి ఆగింది. ఖమ్మంలో అది ఎక్కువసేపు ఆగదు. వేగంగా కదిలి ఆఖరి బోగి ఎక్కింది చిత్ర. ఇంటర్మీడియట్ స్పాట్ కి అందుకోవాలంటే, ఆ ట్రైన్ లో వెళితేనే టైంకి స్పాట్ సెంటరుకి చేరు కోగలదు. ఆ బోగి లో కూడా సీట్స్ ఏమి ఖాళీగా లేవు. ఇంత లో ఎవరో మాడం అని పిలిచినట్లు వినిపించింది.
Oct 19, 2024
ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజుల్లో అంబరీషుడు పరమ భాగవతోత్తముడు. విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడు. అంబరీషుడు ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు. దానధర్మాలు చేశాడు. ప్రజలకు ఏ లోటు లేకుండా, రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఆయువు తీరిన తర్వాత అంబరీషుడు స్వర్గానికి చేరుకున్నాడు.
Oct 18, 2024
అమ్మానాన్న, అయిదుగురం అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళు వెరసి తొమ్మిదిమంది కుటుంబసభ్యులం. నాన్నొక్కరే సంపాదనాపరుడు. వారికి నలభైరూపాయలే జీతం. ఆ జీతం నెల మొదటివారానికే మాకు సరిపోయేది. తర్వాత? అమ్మ అప్పు చేసేది. రెండురూపాయలూ, మూడురూపాయలు అప్పుచేసి, నూకలు కొని, వండి వార్చేది.
Oct 10, 2024
కొన్ని కథలు: మరిన్ని జ్ఞాపకాలు
చిన్నప్ప లేచిందంటే...తెల్లారినట్టే! తెల్లారినదగ్గరనుంచీ ఒకటే దండకం. శివయ్యతో పేచీ పడుతూనే ఉంటుందామె. తొందరగా నిర్మాల్యాన్ని తొలగించమంటాడు శివయ్య. అభిషేకం చెయ్యమంటాడు. చిన్నప్ప వినదు. ఆగంటుంది. దంతధావనం చెయ్యలేదంటుంది.
Oct 5, 2024
ధారా నగరం లో మాధవుడు,నందుడు అనే ఇద్దరు మిత్రులు వుండేవారు. వారిద్దరూ దూరంగా వుండే గురుకులం లో విద్య అభ్యసించదానికి వెళ్ళారు. వారిలో మాధవుడు అత్యంత మేధావి. నందుడు కాస్త మందుడు.
Oct 1, 2024
రెండేళ్లయింది. రాజ్యంలో వర్షాల్లేవు. నీరే తల్లి, నీరే తండ్రి, నీరే తిండి, నీరే జీవితం అయినప్పుడు, జీవితం లేదంటే...రాజ్యంలో ఎవరు ఉంటారు? ఉండరు కదా! అందుకే పక్షులూ, పశువులూ వలసపోయాయి. ప్రజలుకూడా చాలామంది వలసపోయారు.
Sep 23, 2024
మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ జనన మరణాలు సృష్టి నియమాలు. విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. లేకపోతే, మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు.
Sep 18, 2024
పందొమ్మిదివందల ఎనభయ్యవ సంవత్సరం. ‘విపుల:చతుర’కి సబ్ ఎడిటర్ గా ఉన్న రోజులు. ఆఫీసులో లంచ్ అయిన తర్వాత కొలీగ్సంతా కలసి, కెసిపి గెస్ట్ హౌస్ దగ్గరి పాన్ షాప్ కి వెళ్లేవాళ్లం. పాన్ బిగించి, అక్కడ సిగరెట్ తాగేవాళ్లం.
Sep 16, 2024
భయపడేవాడిని లోకం మరింత భయపెడుతుంది. భయంతో కుంచించుకుపోయిన మనిషి జీవితంలో ఏదీ సాధించలేడు. భయానికి విరుగుడు సాహసం. ధైర్య సాహసాలున్న చోట అపజయానికి చోటుండదు. భయానికి ఎదురొడ్డి నిలబడటమే విజయానికి తొలి సోపానం.
Sep 10, 2024
ఒకానొక అడవిలో ఓ మర్రిచెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తోంది. అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తోంది.. ఒక వేటగాడు రోజూ రాత్రి ఆ చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ ఓ వలను పరచి వెళ్లేవాడు. రాత్రివేళ అందులో ఏవో ఒక జంతువులు చిక్కుకుంటాయి కనుక ఉదయమే వచ్చి వలలో చిక్కిన వాటిని చక్కగా తీసుకుని పోయేవాడు.
Sep 9, 2024
ఏం రాస్తున్నామన్నది తర్వాత శర్మగారూ! ముందు రాయడం ప్రారంభించాలి. కుళాయి తిప్పితేనే గదా నీరొచ్చేది అన్నారు డి. కామేశ్వరి ఓసారి. ఆసారి నాకు చాలా కబుర్లు చెప్పారామె. మీరు కథలపోటీలు నిర్వహిస్తారుకదా! ఆ పోటీలకు కథ రాసినప్పుడు మీరు పేర్కొన్న ఏ నియమనిబంధనలూ నేను పాటించను. కథ రాస్తానంతే! మీకు నచ్చితే బహుమతి ఇస్తారు. ప్రచురిస్తారు. లేదంటే...తిప్పి పంపుతారు.
Sep 5, 2024
కృతయుగంలో సుప్రతీకుడు అనే రాజు ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. వారికి ఎప్పటికీ సంతానం కలగకపోవడంతో సుప్రతీకుడు చిత్రకూట పర్వతంపై ఆశ్రమం ఏర్పరచుకున్న ఆత్రేయ మహర్షిని ఆశ్రయించి, ఆయన అనుగ్రహంతో దుర్జయుడనే పుత్రుణ్ణి పొందాడు. దుర్జయుడు అమిత బలవంతుడు. అపార సేనాసంపత్తితో దిగ్విజయయాత్రకు వెళ్లి, సమస్త భూమండలాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.
Sep 4, 2024
పార్వతీపురంలో, మా ఇంటి ఎదురుగా రచయిత పంతులజోగారావుగారు ఉండేవారు. ఆనాటికే ఆయన పేరున్న రచయిత. నేనింకా రచనలో ఓనమాలు ఇసుకలో దిద్దుతున్న రోజులవి. ఒకనాడు ఆయన్ని పరిచయంచేసుకుని, కొత్తగా నేను రాసిన కవిత ఒకటి వినిపించాను. విని, నవ్వారాయన. ‘‘ఏదైనా వ్రాయడానికి ముందు చదవడం అలవాటుచేసుకుంటే బాగుంటుంది. నువ్వేం చదివావు?’’ అడిగారు. ఏమీ చదవలేదన్నాను.
Aug 31, 2024
పలుకుబడులు నుడికారాలకు పుట్టిల్లు తెలుగు భాష





















