మెరుపు కవిత్వం

చేయి బలంగా విసిరి
మెరుపుని గుప్పెట పట్టడం
కవిత్వం
శూన్యంలోకి ఎగిరి
నక్షత్రమాలని లాగి ధరించడం
కవిత్వం
కాళ్లు నేలన బలంగా పాతుకుని
ఎడం చేత్తో నింగిని
చర్రున కిందికి వంచడం
కవిత్వం
ప్రియుడికి అధరామృతాన్నిచ్చీ
బిడ్డకీ అమృతమయ పాలధారల్ని
మిగల్చటం
కవిత్వం
కవి చేవ్రాలు కవిత్వం
-పెమ్మరాజు గోపాలకృష్ణ
ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ తొలి అడుగులు
ఈ రకంగా చూస్తే కందుకూరి పాశ్చాత్య విమర్శనా లక్షణాలను ఆకళింపు చేసుకున్నప్పటికీ తెలుగులో ఆధునిక విమర్శ మార్గాన్ని ప్రామాణిక రీతిలో నిర్వచించలేకపోయారు. అభాగ్యోపాఖ్యానము , ఆంధ్ర కవుల చరిత్ర అనే రచనలు కూడా చేశారు.
Feb 27, 2026
చురకల మెరుపుల కార్టూనిస్టు సురేంద్ర
మొదటి పేజీలో ఒక మూల వుండే ప్యాకెట్ కార్టూన్కి బదులు ఇలా రన్నింగ్ కామెంటరీ ఉండాలని దాదాపు అందరు సంపాదకులూ అనుకున్నారు. సాయంత్రం పార్టీల్లో ఆ పొట్టి కవితల్ని కోట్ చేయడం ఆహా వోహో అనుకోడం...అలా నడిచాయి అప్పటిరోజులు. 1980 నుంచి 2000 సంవత్సరందాకా ఈ జోరు నడిచింది.
Feb 23, 2026
మహిళలు కథలు చాలా ఆసక్తికరంగా చెప్పగలరు. అదే ఒరవడి వాళ్లు రాసిన కథల్లోనూ కనిపిస్తుంది. శిల్పం లేనట్లుగా అనిపించే వినూత్నమైన శిల్పం వారి కథల్లో కనిపిస్తుంది. డాక్టర్ తంగెళ్ల శ్రీదేవి రెడ్డి రాసిన కథలను చదువుతుంటే అలా అనిపించింది.
Feb 19, 2026
కొంచెం నా గురించి... ఇంకొంచెం కేశవ రెడ్డి గురించి...
కేశవరెడ్డిని రచయితలకే రచయితగా చెబుతారు. పైగా పాపులర్ లిటరేచర్ ఆయన రాయలేదు. చాలా సీరియస్ నవలా రచనలు చేశారు. స్మశానం దున్నేరు, రాముడుండాడు రాజ్యముండాది, ఇన్క్రెడిబుల్ గాడెస్, అతడు అడవిని జయించాడు, చివరి గుడిసె, మూగవాని పిల్లనగ్రోవి, మనెమ్మ వంటి నవలలు రాశారు.
Feb 5, 2026
ఆయన వర్గమూలాలు పేర కవితా సంపుటిని వెలువరించాడు. ఇందులో ఒక కవితను కూడా తీసేయడానికి వీలు కాదు. అంత తాజాదనంతో కవితలు వున్నాయి. కవిత్వమంతా మల్లెపూల పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది. నేను కొన్ని అక్షరాలు ఒక గమ్యం అనే కవితలో తిరగబడిన అక్షరాలను బుదగరించి, అలక వహించిన అక్షరాలను బతిమిలాడి, ఆగమాగం అయ్యే అక్షరాలను క్రమంలో పెట్టి తాను ఎలా కవితను అల్లుతాడో చెప్పాడు.
Jan 28, 2026
రానురాను ట్రంప్ లా తయారౌతున్నాడేంటి?
ప్లీజ్ బాబాయ్..నా మనసేం బాగాలేదు..కోపం తెప్పించకు.నేను వినను. దానికి ప్రైజ్ వస్తే నేనేం చెయ్యను? అని బాబాయ్ని గెంటేసినంత పనిచేశాడు.
Jan 22, 2026
వ్యక్తిగత జీవితాలు, సమాజం తలకిందులుగా వున్నాయని, తలకిందుల విలువలు ఆధిపత్యం సాధిస్తున్నాయని మమత తన కవిత్వంలో పలుకుతూ అవి ఎంత అందంగా, ఎంత సున్నితంగా వుండాలో చెప్పారు. కవిత్వం మొత్తంలో ఒక ఆశాకిరణం కనిపిస్తూ వుంటుంది.
Jan 21, 2026
అవతలవైపు అప్పుడే ఎక్కడానికి సతమతమవుతున్న రామం నానా అవస్థాపడ్డాడు. ఎలాగో ఇద్దరి మధ్య ఇరుక్కుని నిలబడ్డాడు. కాలు వెనకడుగు వేస్తే అక్కడ సీట్లో ఉన్న మహిళా మణి ఖస్సుమంటుంది, చేయి ఆడిస్తే మరో మహిళారత్నం తిడుతుంది.
Jan 17, 2026
సరిగ్గా ఏడవుతుండగా స్వామి దర్శనమైంది. ఆయనేం పెద్ద ఆజానుబాహుడేమీ కాదు గానీ ముఖం కనపడకుండా భక్తులకు కేవలం కుంకుమ బొట్లతోనే దర్శనమిచ్చాడు. ఆయన త్రిశూలం పక్కన బెట్టుకుని, చెంబులోంచి కాసిని నీళ్లు తాగి మైకు దగ్గరకు లాక్కున్నాడు. ‘శివోహం’ అన్నాడు గట్టిగా. అంతే అప్పటిదాకా మిర్చీలు, పావుబాజీలు, ఇంటిగొడవలతో సరదా కబుర్లలో ఉన్న భక్తులంతా అలెర్ట్ అయి ‘ఓహోం’ అన్నారు.
Jan 16, 2026
కానీ మమ్మల్ని మేల్కొల్పింది నువ్వుకాదు. ఓహో! ఇంకా వాళ్లు దానికోసం వెతుకుతున్నారు. కర్టెన్ లాగుతున్నారు’ అని అనవచ్చు ఎవరేనా, ఒకటి రెండు పేజీలు ఇలా చదవవచ్చు. ఇప్పుడు వాళ్లు కనుగొన్నారు.
Jan 9, 2026
|
TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
|



