లోక్సభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ.. కొన్ని సార్లు వేగంగా.. మరికొన్ని సార్లు నెమ్మదిగా సాగుతోంది. దీంతో అసలు ఈ కేసు విచారణ ఎంత వరకు వచ్చిందంటే... సీబీఐ అధికారులే ఈ కేసుపై క్లియర్ కట్గా ఓ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారనే ఓ టాక్ అయితే ఉమ్మడి కడప జిల్లాలో జోరుగా నడుస్తోంది. అయితే ఈ కేసులో దోషులు బయటపడతారని వివేకా కుమార్తె సునీత కళ్లల్లో ఒత్తులు వేసుకునీ మరీ ఎదురు చూస్తున్నారు. కానీ ఈ కేసు విచారణ మాత్రం నత్తతో పోటీపడి నడుస్తోంది. మరోవైపు వివేకా హత్య కేసులో సీఎం జగన్తోపాటు కడప ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని విపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా వివేకా హత్య అనంతరం పులివెందుల్లో వైయస్ ఫ్యామిలీలోని వారే వర్గాలుగా విడిపోయారని పులివెందులలో జనం చర్చించుకుంటున్నారు. దీంతో గతంలో కడప జిల్లా అనగానే వైయస్ ఫ్యామిలీ గుర్తుకు వచ్చేదని.. నేడు ఆ పరిస్థితి లేదన్న భావన ఆ జిల్లా వాసులలో వ్యక్తం అవుతోంది.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చేది ఎన్నికల సీజన్.. అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో.... బాబాయ్ గొడ్డలి పోటును.. తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సీఎం జగన్ పావులు కదుపుతున్నారని వైసీపీ శ్రేణుులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం సైకిల్ పార్టీకి స్పీడుకు న్ బ్రేకులు వేసేందుకు.. వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి వివేకా కుమార్తె సునీతను వైసీపీ అభ్యర్థిగారంగంలోని దింపాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
1978 నుంచి పులివెందుల నియోజకవర్గం వైయస్ ఫ్యామిలీకి కంచుకోట అన్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్, ఆయన తరువాత వైయస్ విజయమ్మ, ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ ఇక్కడి నుంచి గెలిచి.. అసెంబ్లీలో అడుగు పెట్టిన విషయం విదితమే. అయితే ఈ నియోజకవర్గాన్ని సునీతకు కట్టబెట్టి.. ఇదే జిల్లాలోని జమ్మలమడుగు నుంచి జగన్ రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకొంటున్నారని వైసీపీ వర్గాల సమాచారం.
సదరు నియోజకవర్గం కూడా వైయస్ ఫ్యామిలీకి కంచుకోటే. ఆ నియోజకవర్గంలో కూడా వైయస్ ఫ్యామిలీకి భారీగా అభిమానులున్నారు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు చాలా బలంగా ఉన్నా.. ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. అదీకాక.. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి.. తొలినాళ్లలో ఇదే నియోజకవర్గంలో వైద్యునిగా పని చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సంగతి తెలిసిందే.
మరి వైయస్ జగన్ చేస్తున్న రాజకీయంలో వైయస్ వివేకా కుమార్తె సునీత చిక్కుతారో లేక తన తండ్రి హత్యకు కారకులైన వారిని న్యాయదేవత సాక్షిగా న్యాయస్థానంలో నిలబెట్టి.. వారికి కఠిన శిక్ష పడేలా చేసి.. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చేలా ఆమె.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారా? అని కడప జిల్లా జిల్లా ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-sunita-as-ycp-candidate-from-pulivendula-jagan-sketch-39-139120.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.