Publish Date:Jul 12, 2021
ప్రజా సమస్యలపై దీక్షలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు వైఎస్ షర్మిల. కొత్త పార్టీతో ఇక తన సత్తా ఏంటో నిరూపించుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే నిరుద్యోగ సమస్యలపై ఇందిరా పార్కు దగ్గర దీక్ష చేయడం.. జాకెట్ చినగడం.. అరెస్ట్ కావడం.. ఇలా పొలిటికల్గా ఫుల్ మైలేజ్ తెచ్చుకున్నారు షర్మిల. ఆ టెంపోను అలానే కంటిన్యూ చేసేందుకు.. తాజాగా తాడిపత్రిలో నిరుద్యోగ నిరాహార దీక్షకు సిద్దమవుతున్నారు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.
పార్టీ ప్రకటన అనంతరం షర్మిల తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల పర్యటనకు సిద్దమవుతున్నారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగుల కోసం చేస్తున్న నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా, వైఎస్ షర్మిల ఈ నెల 13న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపత్రి గ్రామంలో ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ చేపట్టనున్నారు.
తాడిపత్రికి చెందిన కొండల్ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించనున్నారు. బాధిత కుటుంబీకుల సమక్షంలో పగలంతా.. ఆమె నిరాహారదీక్ష చేయనున్నారు. అయితే.. షర్మిల దీక్ష విషయం తెలిసి టీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. షర్మిల రాకకు ముందే.. సోమవారం మంత్రి నిరంజన్రెడ్డి కొండల్ కుటుంబాన్ని పరామర్శించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామంలో ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదంటూ ఇటీవల కొండల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో కలకలంగా మారింది. ఈ విషయం తెలిసి షర్మిల మంగళవారం కొండల్ ఇంట్లో దీక్షకు సిద్దమయ్యారు. షర్మిల దీక్షకు కౌంటర్గా అన్నట్టు.. తాజాగా మంత్రి నిరంజన్రెడ్డి కొండల్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ. లక్ష చెక్కు అందజేశారు. కొండల్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. యువత క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని.. ప్రభుత్వం దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి తెలిపారు. త్వరలో భారీ నోటిఫికేషన్లు రానున్నాయని విద్యార్థులు ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు.
అటు.. షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష.. ఇటు మంత్రి నిరంజన్రెడ్డి ఓదార్పు యాత్రతో తాడిపర్తి గ్రామంలో రాజకీయ హడావుడి నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-sharmila-deeksha-at-thadipatri-village-25-119407.html
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.