Publish Date:Apr 29, 2020
కరోనా మహమ్మారి తో ప్రజలు విలవిలాడుతుంటే అధికార వైసీపీ గుండాలు అభివృద్ధి శిలాఫలకాలును ధ్వంసం చేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలా ఫలకాల ధ్వంసంతో తాను చేసిన అభివృద్ధిని ప్రజల హృదయాల్లో నుంచి చెరపలేరన్నారు. మార్టూరు మండలం డేగరముడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కోట్లాది రూపాయలతో వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు అప్పటి మంత్రులు పరిటాల సునీత, సిద్ధ రాఘవరావు లు శంకుస్థాపన చేశారని ,ఆ శిలా ఫలకాలను మంగళవారం రాత్రి వైసిపి కార్యకర్తలు ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. ఒక పక్క రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న తరుణంలో అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిది పోయి గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి శిలాఫలకాలు ధ్వంసం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గం వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు.
శిలా పలకాలని ధ్వంసం చేస్తే తాను చేసిన అభివృద్ధిని ప్రజల హృదయాల్లో నుంచి చెరప లేరని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎవరి హయాంలో జరిగాయో ప్రజలందరికీ తెలుసునన్నారు. నియోజకవర్గ సర్వతోముఖా అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానన్నారు. అలాగని అభివృద్ధిని ధ్వంసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తన ప్రతి అడుగు ప్రజల కోసం ప్రగతి కోసం అని స్పష్టం చేశారు. అరాచకాలతో అభివృద్ధిని అడ్డుకోవడం సాధ్యం కాదన్నారు. అరాచకాలకు పాల్పడటం హేయమైన చర్య. తాను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతోనే మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచానన్నారు. ఈ దుశ్చర్యలకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yeluri-sambasiva-rao-slams-ycp-39-98528.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.