సునితారెడ్డి సవాల్.. వణికిపోతున్న వైసీపీ?

Publish Date:Apr 3, 2024

Advertisement

వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య ఘ‌ట‌న ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వివేకా హ‌త్య‌ను వాడుకొని ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం  తెలిసిందే. వివేకా హ‌త్య‌ను చంద్ర‌బాబు, తెలుగుదేశం నేత‌ల‌పై నెట్ట‌డంలో జ‌గ‌న్, వైసీపీ నేత‌లు విజ‌యం సాధించారు. అయితే, వివేకా హ‌త్య‌కు కార‌ణం తెలుగుదేశం నేత‌లు కాద‌ని తేలిపోయింది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి వివేకా హ‌త్య‌లో ప్ర‌ధాన ముద్దాయి అని విచార‌ణ‌ సంస్థ‌లు తేల్చేశాయి. అయినా  అవినాశ్ అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్ అధికారాన్ని ఉప‌యోగిస్తూ అండ‌గా నిలిస్తున్నారని జ‌గ‌న్ చెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు సూటిగానే ఆరోపిస్తున్నారు. వివేకా హ‌త్య కేసులో నిందితుల‌కు శిక్ష ప‌డాల‌ని సునీతారెడ్డి కోర్టుల్లో పోరాటం చేస్తున్న విష‌యం తెలిసింది. అయినా, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి అవినాశ్ రెడ్డికి క‌డ‌ప‌ ఎంపీ టికెట్ ఇవ్వ‌డం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ నిర్ణ‌యంతో మ‌రింత ఆగ్ర‌హంతో ఉన్న సునీతారెడ్డి, వైఎస్ ష‌ర్మిలలు ఈ వ్య‌వ‌హారంపై నేరుగా ప్ర‌జ‌ల్లో తేల్చుకునేందుకు సిద్ధ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు  పోటీ చేస్తుండ‌గా.. వివేకా హ‌త్య‌పై చ‌ర్చ‌కు ఎక్క‌డైనా సిద్ధ‌మ‌ని, సాక్షి ఛానెల్‌లోనూ చ‌ర్చ‌కు వ‌స్తాన‌ని సునీతారెడ్డి సవాల్ చేశారు.

 గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వివేకానంద‌రెడ్డి హ‌త్య వ్య‌వ‌హారం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం పీఠాన్ని అదిరోహించ‌డంలో కీల‌క భూమిక పోషించింది. ప్ర‌స్తుత‌ ఎన్నిక‌ల్లో అదే వివేకా హ‌త్య ఘ‌ట‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌ధాన ఆయుధంగా మార‌బోతుంది. ప్ర‌తిప‌క్షాల‌కు తోడు.. చెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు ప్ర‌జా క్షేత్రంలో జ‌గ‌న్ అరాచ‌కాలను నిల‌దీసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ పార్టీకి ఎవ‌రూ ఓట్లు వేయొద్ద‌ని, హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించొదంటూ సునితారెడ్డి బ‌హిరంగంగానే ప్ర‌జ‌ల‌ను కోరారు. తాజాగా, ఆమె మ‌రో అడుగు ముందుకేసి వివేకా హ‌త్య ఘ‌ట‌నపై ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని, అవ‌స‌ర‌మైతే సాక్షి ఛాన‌ల్ లోనూ తాను చ‌ర్చ‌కు వ‌స్తాన‌ని, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చ‌ర్చ‌కు రావాల‌ని   ఛాలెంజ్ చేశారు. సునీతా ఛాలెంజ్‌తో వైసీపీ శ్రేణులు వణికిపోతున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త కనిపిస్తోంది. దీంతో వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓట‌మి భ‌యం వెంటాడుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో సునీతారెడ్డి సవాల్ లో వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడిన‌ట్లుగా అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసులో ప్ర‌ధాన ముద్దాయి అవినాశ్ రెడ్డి అంటూ ష‌ర్మిల‌, సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. అవినాశ్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్ అడ్డుకుంటున్నాడ‌ని వాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌న తండ్రిని హ‌త్య‌చేసిన హంత‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతూ సునీతారెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌, ఆయన పార్టీ నేతలూ వివేకా హంత‌కులు సునీతారెడ్డి, ఆమె భ‌ర్త అని, వివేకా అక్ర‌మ సంబంధ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మంటూ ప్ర‌చారం చేశారు. ప్ర‌తీరోజూ సునీతారెడ్డిపై బుర‌ద జ‌ల్ల‌ట‌మే ప‌నిగా వైసీపీ వ్యవహరించింది.   ఇలాంటి ప‌రిస్థితుల్లో సునీతారెడ్డి ఛాలెంజ్‌ను జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స్వీక‌రించ‌కుంటే ఇన్నాళ్లూ తాము  సునీతారెడ్డి, ష‌ర్మిల‌పై చేసిన విమ‌ర్శ‌లు త‌ప్పుడు విమ‌ర్శ‌ల‌ని ప్ర‌జ‌లు అర్థం చేసుకొనే ప్ర‌మాదం ఉంద‌ని వైసీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు‌. జ‌గ‌న్ స్థానంలో ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తీరెడ్డి రంగంలోకిదిగి సునీతారెడ్డితో చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌వ్వాల‌ని, అలా చేయ‌కుంటే మ‌రికొద్దిరోజుల్లో జ‌రిగే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ స‌ర్కార్ కుప్ప‌కూలడం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జైలుకు వెళ్లిన స‌మ‌యంలో పార్టీ బాధ్య‌త‌ల‌ను ఆయ‌న చెల్లెలు ష‌ర్మిల భుజానికెత్తుకున్నారు. పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి జ‌గ‌న్ జైలు నుంచి మ‌ళ్లీ తిరిగొచ్చే వ‌ర‌కు వైసీపీ బ‌లోపేతానికి ఆమె కృషి చేశారు. అలాంటి చెల్లెలు సైతం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పూర్తిగా మారిపోయారని, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌న‌కు విరుద్దంగా వైసీపీ పాల‌న ఉందంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వివేకా హ‌త్య‌కేసులో ముద్దాయి అవినాశ్ రెడ్డి అని స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మ‌ళ్లీ క‌డ‌ప ఎంపీ సీటును అవినాశ్ రెడ్డికి ఇవ్వ‌డంపై ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని రాజ‌కీయంగానే ఎదుర్కొనేందుకు వారు సిద్ధ‌మ‌య్యారు. ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఉన్న వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల్లో అవినాశ్ రెడ్డిని ఓడించ‌డం ద్వారా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి షాకిచ్చేందుకు ష‌ర్మిల సిద్ధ‌వ్వ‌డం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఒక‌వైపు వివేకా హ‌త్య‌కేసు, క‌డ‌ప‌లో వైఎస్ ష‌ర్మిల పోటీ, మ‌రోవైపు జ‌గ‌న్ తో వివేకా హ‌త్య‌పై చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మంటూ సునీతారెడ్డి సవాల్ ఇలా అన్ని అంశాలు ఏపీ రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తుండ‌గా.. వైసీపీ అభ్య‌ర్థుల్లో ఓట‌మి భ‌యాన్ని పెంచుతున్నాయి.

By
en-us Political News

  
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.