వైసీపీకి పెట్టని కోట లాంటి కడప బీటలు వారుతోంది. ఆ పార్టీకి కడప జిల్లాలో ముందు గొయ్యి, వెనుక నుయ్యి వంటి పరిస్థితి ఏర్పడిందా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే మస్తున్నది. వైఎస్ హయాం నుంచీ కూడా ఆ కుటుంబానికి గట్టి బలమున్న కడప జిల్లా ప్రస్తుతం వైఎస్ కుటుంబం పట్టు జారిపోతోంది. వైసీపీని వీడి వెడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సొంత జిల్లాలోనే పార్టీ నుంచి వలసనలను నిరోధించడంలో వైసీపీ అధినేత జగన్ విఫలమౌతున్నారు. ఇందుకు ప్రధాన కారణం జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది. దశాబ్దాల విశ్వాసాన్ని పక్కన పడేసి జగన్ కు దూరం జరగడానికీ, వైసీపీకి గుడ్ బై చెప్పడానికీ తహతహలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా నేతలు వైసీపీని వీడటానికి సమయం కోసం వేచి చూస్తున్నారన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు తరువాత నుంచీ జిల్లాలో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిందంటున్నారు. పులివెందుల జడ్పీటీసీ బైపోల్ లో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక ఘోర పరాజయం పాలైన తరువాత.. కనీసం ఖర్చులైనా ఇవ్వండంటూ మొరపెట్టుకుంటే పార్టీ నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో ఆ ఎన్నికలో వైసీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి సహా.. ఆయనకు మద్దతుగా నిలిచిన వైసీపీయులు ఇప్పుడు తెలుగుదేశం సానుభూతి పరులుగా మారిపోయారు. అదలా ఉంటే.. ఇక ఇప్పుడు కడప కార్పొరేషనూ వైసీపీ చేజారిపోయేలా కనిపిస్తున్నది. ఎలాగైనా కడప కార్పొరేషన్ విషయంలో ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఆమె చొరవతో పలువురు వైసీపీ కార్పొరేటర్లు శివకోటిరెడ్డి, రామ్లక్ష్మణ్రెడ్డి ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి సమక్షంలో సైకిలెక్కేశారు.
వీరికంటే ముందే 8 మంది కార్పొరేటర్లు దేశం గూటికి చేరిపోయారు. తాజా చేరికలలో కడప కార్పొరేషన్ లో వైసీపీని వీడిన కార్పొరేటర్ల సంఖ్య పదికి చేరింది. రానున్న రోజులలో మరిన్ని జంపింగ్ లు ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కడపలో వైసీపీ ఖాళీ అవుతుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో వైసీపీ కార్యక్రమాలు తూతూమంత్రం చందంగా సాగుతుండటాన్ని చూపుతూ, చుట్టపు చూపుగా జగన్ వచ్చినప్పుడు తప్ప మిగిలిన రోజులలో జిల్లాలో వైసీపీ అసలు ఉందా అన్న వాతావరణమే కనిపిస్తోందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-to-loose-kadapa-corporation-soon-39-214880.html
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!