వైసీపీకి పెట్టని కోట లాంటి కడప బీటలు వారుతోంది. ఆ పార్టీకి కడప జిల్లాలో ముందు గొయ్యి, వెనుక నుయ్యి వంటి పరిస్థితి ఏర్పడిందా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే మస్తున్నది. వైఎస్ హయాం నుంచీ కూడా ఆ కుటుంబానికి గట్టి బలమున్న కడప జిల్లా ప్రస్తుతం వైఎస్ కుటుంబం పట్టు జారిపోతోంది. వైసీపీని వీడి వెడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సొంత జిల్లాలోనే పార్టీ నుంచి వలసనలను నిరోధించడంలో వైసీపీ అధినేత జగన్ విఫలమౌతున్నారు. ఇందుకు ప్రధాన కారణం జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది. దశాబ్దాల విశ్వాసాన్ని పక్కన పడేసి జగన్ కు దూరం జరగడానికీ, వైసీపీకి గుడ్ బై చెప్పడానికీ తహతహలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా నేతలు వైసీపీని వీడటానికి సమయం కోసం వేచి చూస్తున్నారన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు తరువాత నుంచీ జిల్లాలో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిందంటున్నారు. పులివెందుల జడ్పీటీసీ బైపోల్ లో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక ఘోర పరాజయం పాలైన తరువాత.. కనీసం ఖర్చులైనా ఇవ్వండంటూ మొరపెట్టుకుంటే పార్టీ నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో ఆ ఎన్నికలో వైసీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి సహా.. ఆయనకు మద్దతుగా నిలిచిన వైసీపీయులు ఇప్పుడు తెలుగుదేశం సానుభూతి పరులుగా మారిపోయారు. అదలా ఉంటే.. ఇక ఇప్పుడు కడప కార్పొరేషనూ వైసీపీ చేజారిపోయేలా కనిపిస్తున్నది. ఎలాగైనా కడప కార్పొరేషన్ విషయంలో ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఆమె చొరవతో పలువురు వైసీపీ కార్పొరేటర్లు శివకోటిరెడ్డి, రామ్లక్ష్మణ్రెడ్డి ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి సమక్షంలో సైకిలెక్కేశారు.
వీరికంటే ముందే 8 మంది కార్పొరేటర్లు దేశం గూటికి చేరిపోయారు. తాజా చేరికలలో కడప కార్పొరేషన్ లో వైసీపీని వీడిన కార్పొరేటర్ల సంఖ్య పదికి చేరింది. రానున్న రోజులలో మరిన్ని జంపింగ్ లు ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కడపలో వైసీపీ ఖాళీ అవుతుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో వైసీపీ కార్యక్రమాలు తూతూమంత్రం చందంగా సాగుతుండటాన్ని చూపుతూ, చుట్టపు చూపుగా జగన్ వచ్చినప్పుడు తప్ప మిగిలిన రోజులలో జిల్లాలో వైసీపీ అసలు ఉందా అన్న వాతావరణమే కనిపిస్తోందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-to-loose-kadapa-corporation-soon-25-214881.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.