అమరావతిపై వైసీపీ విషం... పెట్టుబడులు పెట్టొద్దంటూ ఇన్వెస్టర్లకు సజ్జల హెచ్చరిక

Publish Date:Apr 10, 2026

Advertisement

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది వైసీపీ తీరు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీకి గిట్టదని ఆ పార్టీ నేతలు తమ ప్రకటనలతో పదే పదే చెబుతున్నారు. తాజాగా ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్నారెడ్డి మాటలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైసీపీకి సుతరామూ ఇష్టం లేదని  మరో సారి ప్రస్ఫుటంగా రుజువైంది. అమరావతిలో పెట్టుబడులు పెడితే కృష్ణ నదిలో కలిసినట్లేనని పెట్టుబడి దారులను హెచ్చరించింది. ఈ పార్టీ కీలక నేత, జగన్ హయాంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టుబడిదారులను అమరావతిలో పెట్టుబడులు పెట్టవద్దంటూ హెచ్చరిక జారీ చేశారు.   రాజధాని అమరావతి పేరుతో సాగుతున్నదంతా అబద్ధపు ప్రచారమేనన్నారు.  

అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల. 

సజ్జల, వైసీపీ నేతలు అమరావతిపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నా.. వాస్తవానికి అక్కడ పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణం చేపట్టాయి. అవి దాదాపు తుది దశకు వచ్చాయి. ఇక స్టార్ హోటళ్లు, పలు వాణిజ్య, వ్యాపార సంస్థలు కార్యకలపాల నిర్వహణకు రెడీ అయిపోయాయి. ఇటువంటి తరుణంలో అమరావతిలో పెట్టుబడులు పెడితే ఆ సొమ్ములు కృష్ణా నదిలో పారబోసినట్లే నంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమరశలు వెల్లువెత్తుతున్నాయి.

అమరావతి అభివృద్ధిని, అక్కడ వచ్చే పెట్టుబడులు అడ్డుకోవడమే వైసీపీ ధ్యేయంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మావిగన్ ప్రతిపాదనతో వైసీపీ అధినేత జగన్ ఒక ట్రోల్ మెటీరియల్ గా మారినట్లుగానే అమరావతిలో పెట్టుబడులు పెట్టవద్దంటూ సజ్జన చేసిన హెచ్చిరకపై కూడా నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. దోచుకోవడం, దాచుకోవడమే వైపీపీకి తెలుసుననీ, అభివృద్ధి అంటే గిట్టదనీ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ వైపు ప్రపంచం మొత్తం అమరావతివైపు చూస్తుంటే వైసీపీ మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని అక్కడ ఏమీ లేదని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి.  

 జగన్ ఐదేళ్ల పాలనలో అమరావతిని నిర్వీర్యం చేసి, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా చేసిన సంగతిని జనం మరిచిపోలేదని, ఇప్పుడు మళ్లీ అమరావతిపై వైసీపీ కక్కుతున్న విషం ఆ పార్టీనే కబలించేస్తుందని అంటున్నారు పరిశీలకులు. అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ తీసుకున్న వైఖరి ఆ పార్టీకి రాష్ట్రంలో ఉనికి లేకుండా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. 

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.