9 శాతం పడిపోయిన వైసీపీ గ్రాఫ్!.. చాణక్య స్ట్రాటజీస్ సర్వే వెల్లడి

Publish Date:Dec 30, 2023

Advertisement

రెండు నెలలలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు   ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.  ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన విజయం పక్కా అని పలు సర్వేలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో  సర్వే   కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది.  తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తుందన్న అంచనాలు ఉండగా,   తెలుగుదేశం, జనసేన కలిస్తే క్లీన్ స్వీప్  గ్యారంటీ అని ఆ సర్వే పేర్కొంది. ఈ మధ్య కాలంలో ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజలకు తెలుగుదేశం పార్టీని మరింత దగ్గర చేసాయని తమ సర్వేలో తేలినట్లు చాణ‌క్య స్ట్రాట‌జీస్ స‌ర్వే వెల్లడించింది. వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరిగి పరిస్థితులన్నీ తెలుగుదేశంకు అనుకూలంగా మారుతున్నట్లు ఈ సర్వే నివేదిక పేర్కొంది. 

2019 ఎన్నికలలో  వైసీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాల్లో విజయం సాధించి వైసీపీ విజయదుందుభి మోగించింది. టీడీపీ కేవలం 23 స్థానాలతో  ఓటమి చవిచూసింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అయితే ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లను వైసీపీ సొంతం చేసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలి ఆరు నెలలలోనే ప్రజలలో అసంతృప్తి మొదలైంది. అది కాస్త నాలుగేళ్ళ కాలం తిరిగేసరికి ప్రజలలో తీవ్ర వ్యతిరేకతగా మారింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ఘోర పరాజయం తప్పదని ఇప్పటికే ఎన్నో సంస్థలు తమ సర్వేల ఫలితాలను వెల్లడించగా.. తాజాగా చాణ‌క్య స్ట్రాట‌జీస్ కూడా ఏపీలో ఈసారి తెలుగుదేశం, జనసేన కూటమిదే విజయం అని తేల్చి చెప్పింది.  

చాణ‌క్య స్ట్రాట‌జీస్ స‌ర్వే రాష్ట్రంలో ప‌ర్య‌టించి వివ‌రాలు సేక‌రించింది.  దీని ప్ర‌కారం.. అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, జ‌న‌సేన స‌హా ఇత‌ర పార్టీల ప‌రిస్థితిని అంచనా వేసింది. ఈ స‌ర్వే వివ‌రాల‌ను తాజాగా వెల్ల‌డించింది. ఈ సర్వే ప్రకారం గ‌డిచిన నాలుగేళ్ళలో తెలుగుదేశం  పుంజుకుంది. అదేస‌మ‌యంలో అధికార పార్టీ వైసీపీ గ్రాఫ్ ప‌డిపోయింది. ఇక‌, జ‌న‌సేన స‌హా ఇత‌ర పార్టీల గ్రాఫ్ కూడా కొంత మేర‌కు పెరిగిన‌ట్టు తెలుస్తోంది. 2019 ఎన్నిక‌లలో తెలుగుదేశంకు    39 శాతం ఓట్లు రాగా  ప్ర‌స్తుతం ఇది 4 శాతం పెరిగి 43 శాతానికి చేరినట్లు చాణక్య  వెల్లడించింది. అలాగే వైసీపీకి 2019 ఎన్నిక‌లలో 50 శాతం ఓటింగ్ గ్రాఫ్ దక్కించుకోగా.. ప్ర‌స్తుతం అది ఏకంగా 9 శాతం దిగజారిపోయి 41 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. అలాగే 2019 ఎన్నిక‌లలో 6 శాతం ఓటింగ్ తో ఉన్న జనసేన పార్టీ ప్ర‌స్తుతం 4 శాతం పెరిగి 10 శాతానికి చేరిందని, ఇక ఇత‌ర పార్టీలు 2019 ఎన్నిక‌లలో 5 శాతం ఓటింగ్ పొందగా.. ఇప్పుడు ఒక శాతం పెరిగి 6 శాతానికి చేరిందని తెలిపారు.

ప్ర‌స్తుతం ఉన్న ఈ గ్రాఫ్‌లు ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌రింత పెర‌గ‌డ‌మో, త‌గ్గ‌డ‌మో జ‌రుగుతుంద‌ని స‌ర్వే   వెల్ల‌డించగా.. టీడీపీ, జనసేన కూటమి  గ్రాఫ్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ సర్వే  ప్రకారం చూస్తే జనసేన లేకుండా టీడీపీ 43 శాతం ఓటింగ్ దక్కించుకోనుండగా.. వైసీపీకి 41 శాతం మాత్రమే దక్కనున్నాయి. జనసేన కలిస్తే ఇది 51 శాతానికి చేరి కనీవినీ ఎరుగని విజయం దక్కించుకోనుంది. సామాజిక వర్గాలు, పేద, మధ్యతరగతి ప్రజలను విభజించి వారి  శాంపిల్స్ సేకరించిన ఈ చాణక్య  స్ట్రాటజీస్ సర్వే ప్రకారం.. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తేలింది. అటు అర్బన్ ఓటర్ల నుండి గ్రామీణ ఓటర్ల వరకూ ఎటు చూసినా వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తున్నట్లు ఈ సర్వే పేర్కొంది. మొత్తంగా ఈ సర్వేప్రకారం తెలుగుదేశం, జనసేన కూటమి వచ్చే ఎన్నికలలో అద్భుత విజయం సాధించడం ఖాయం.

By
en-us Political News

  
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.