ఈ నలుగురికీ సీన్ అర్ధమైపోయిందా?

Publish Date:May 16, 2024

Advertisement

వైసీపీలో  నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుపై ఆశలు ఇసుమంతైనా కనిపించడం లేదు. పార్టీ అధినేత జగన్ నుంచి, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల వరకూ అందరూ మౌనముద్రలోకి వెళ్లిపోయారు. అంబటి వంటి ఒకరిద్దరూ, ఇంత కాలం పార్టీకీ, ప్రభుత్వానికీ  సలహాలిచ్చిన సజ్జల మాత్రం ఎన్నికల సంఘంపైనా, పోలీసులపైనా విమర్శలు గుప్పిస్తూ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారు. ఇక  అవసరమున్నా లేకున్నా విపక్షంపై నోరేసుకు పడిపోయే రోజా, కొడాలి వంటి వారు ఆశ్చర్యకరంగా మౌనముద్రలోకి వెళ్లిపోయారు. పోలింగ్ రోజున తనకు సొంత పార్టీ వారే వ్యతిరేకంగా పని చేశారంటూ ఆరోపణలకు గుప్పించిన రోజా ఆ తరువాత మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఇక కొడాలి నాని అయితే పోలింగ్ రోజున తీరిగ్గా ఎప్పుడో సాయంత్రం వచ్చి కుటుంబంతో సహా ఓటేసి వెళ్లిపోయారు. ఎక్కడా ఎన్నికల తీరు గురించి మాట్లాడలేదు. తన విజయంపై ధీమా వ్యక్తం చేయలేదు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వంశీ అయితే పోలింగ్ రోజున ఏదో హల్ చల్ చేయాలని ప్రయత్నించి భగంపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా ఆయనైతే పోలింగ్ కు ముందే ఇవే తన చివరి ఎన్నికలు, వచ్చే ఎన్నికలలో పోటీ చేయను అని ప్రకటించేసి ముందుగానే గెలుపు ఆశలు వదిలేసుకున్నారు. 

దీంతో ఇప్పుడు రాష్ట్ర మంతటా వైసీపీ ఫైర్ బ్రాండ్ బ్యాచ్ గా పేరుపడ్డ ఈ నలుగురిపైనే చర్చ జరుగుతోంది. వీరి పరిస్థితి ఏమిటి? గెలుపా? ఓటమా? అన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది.  ఆ ఫైర్ బ్రాండ్ బ్యాచే  కొడాలి నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ. అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు కూడా ఉన్నప్పటికీ, పార్టీ అధినేతే వారి గెలుపు చీటీ చింపేసి నియోజకవర్గం మార్చేశారు కనుక అటువంటి వారిపై పెద్దగా చర్చ జరగడం లేదు.  

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వీరు వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారు. జగన్ మీద ఈగ వాలితే ఆ ఈగను కూడా చంద్రబాబే పంపించారు అనే స్థాయిలో విరుచుకుపడేవారు. అటువంటి ఈ నలుగురూ ఈ సారి తమతమ నియోజకవర్గాలలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. 

ముందుగా కొడాలి నాని విషయానికి వస్తే ఆయన గుడివాడ నియోజకవర్గం నుంచి 2004నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. మొదటి రెండు సార్లే తెలుగుదేశం అభ్యర్థిగా, ఆ తరువాత రెండు సార్లూ వైసీపీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు.  జగన్  తొలి క్యాబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. అటువంటి నాని ఈ సారి గుడివాడలో విజయం సాధించే అవకాశాలు దాదాపు మృగ్యమనే చర్చ వైసీపీ లోనే జరుగుతోంది.  ప్రభుత్వ వ్యతిరేకతకు, నాని వ్యవహారశైలి, ఆయన అనుచిత భాషా ప్రావీణ్యంతోడైందనీ, అందుకే ఆయనకు నియోజకవర్గంలో గడ్డు పరిస్థితి ఎదురైందని అంటున్నారు.

 ఇక రోజా విసయానికి వస్తే ఆమె నగరి నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. జగన్ మలి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు.   అయితే ఈ సారి మాత్రం ఆమె విజయం అంత సులువు కాదని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఆమె వ్యవహారశైలి కారణంగా సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆమె విజయానికి పార్టీ పరంగా నగరిలో సహకారం కరవైందని అంటున్నారు. అంతే కాకుండా సొంత పార్టీ నేతలే తెలుగుదేశంకు అనుకూలంగా పని చేశారని అంటున్నారు. వేరే ఎవరో అనడం కాదు, పోలింగ్ రోజున స్వయంగా రోజాయే ఆ విషయం చెప్పి తన ఓటమిని పరోక్షంగానైనా ముందే అంగీకరించేశారు.  

ఇక అంబటి రాంబాబు విషయానికి వస్తే సత్తెన పల్లిలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఆయన వ్యవహారశైలి, ఇష్టారీతిగా నోరు పారేసుకునే విధానం కారణంగా సొంత పార్టీలోనే ఆయన పట్ల అసంతృప్తి వ్యక్తం అయ్యిందంటున్నారు. ఇక ఆయన కూడా పోలీసులు, ఈసీ తెలుగుదేశం కూటమికి అనుకూలంగా పని చేశాయని ఆరోపణలు గుప్పించి, తన ఓటమిని తానే చాటుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక చివరిగా గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ విషయానికి వస్తే... తెలుగుదేశం అభ్యర్థిగా 2019లో విజయం సాధించిన వంశీ ఆ తరువాత వైసీపీ గూటికి చేరిపోయారు. చేరి ఊరుకోకుండా గన్నవరం తెలుగుదేశం శ్రేణులపై వేధింపులకు పాల్పడ్డారు. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈ సారి ఎన్నికల నామినేషన్ సందర్భంగానే వంశీ పట్ల నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత ఏమిటన్నది గోచరమైంది. ఆయన నామినేషన్ ర్యాలీ నామ్ కే వాస్తేగా జరిగింది. పార్టీ శ్రేణులు కూడా దాదాపు ముఖం చాటేశాయని అప్పట్లో గట్టిగా వినిపించింది. మొత్తం మీద ఈ సారి వంశీ గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.