రోత పుట్టిస్తున్న వైైసీపీ బురద రాజకీయం!

Publish Date:Sep 2, 2024

Advertisement

ఒక పక్క భారీ వర్షాలు, వరదలతో జనం నానా ఇబ్బందులూ పడుతుంటే వారిని ఆదుకునేందుకు ఒక రాజకీయ పార్టీగా ఎటువంటి చొరవా తీసుకోవడం మానేసి బురద రాజకీయాలు చేస్తూ వైసీపీ ప్రజలలో తన ప్రతిష్ఠను తానే దిగజార్చుకుంటోంది. తన పరువు తానే తీసుకుంటోంది. 

రాష్ట్రంలో భారీ వరదలతో ప్రజలు కష్టాలలో ఉంటే.. సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్న అధికార యంత్రాంగానికి సహకారం అందించడం మాని రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోంది. వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులను ఆధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎలాగూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా జనం కష్టాలపై కనీస స్పందన కూడా లేకుండా తన విదేశీ పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. యథారాజా తథా ప్రజ అన్నట్లుగా వైసీపీ అధినేత జగన్ జనం సమస్యలను విస్మరించి సొంత పనుల్లో నిమగ్నమై ఉంటే, ఆయన పార్టీ నేతలు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలలో పత్తా లేకుండా పోయారు. ప్రకృతి విపత్తు సమయంలో సంయమనం పాటించి, ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంపై దృష్టి పెట్టాల్సింది వైసీపీ సోషల్ మీడియా వేదికగా రాజధాని అమరావతిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. 

భారీ వరదలకు ఒక్క విజయవాడ మాత్రమే కాదు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి  నగరాల ప్రజలు సైతం ఇబ్బందులకు గురయ్యారు. ఆ విషయాన్ని విస్మిరించి బెజవాడ మినహా ఇంకెక్కడా భారీ వర్షాలు, వరదల కారణంగా జనం ఇబ్బందులు పడలేదన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న వికృత ప్రచారం ప్రజలకు వెగటుపుట్టిస్తోంది. ఈ తీరు వల్ల వైసీపీ పట్ల జనం మరింత విముఖత చూపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏడు పదుల పైబడిన వయస్సులో చంద్రబాబు వరద బాధితులకు భరోసా ఇస్తూ, వారికి అండగా ఉంటూ, వారిలో ధైర్యాన్ని నింపుతుంటే... అనుక్షణం వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ జనంలో ఉంటుంటే.. వైసీపీ నేతలు మాత్రం క్షత్ర స్థాయిలో ఎక్కడా కనిపించకుండా, సోషల్ మీడియా వేదికగా అమరావతిపై విషం చిమ్మడాన్ని జనం చీదరించుకుంటున్నారు.  

వైసీపీ హయాంలోనూ వరదలు సంభవించాయి. అయితే ఆయా సందర్భాలలో జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడైనా, ఎప్పుడైనా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన దాఖలాలు లేవు. ఆయన పర్యటనలన్నీ విగంహ వీక్షణాలకే పరిమితమయ్యాయి.  

అయితే అందుకు భిన్నంగా చంద్రబాబునాయుడు వరద బీభత్సంలో ఇబ్బందులు పడుతున్న బెజవాడ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటున్నారు. రేయింబవళ్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ బాధితులలో ధైర్యం నింపుతూ ప్రభుత్వం అండగా ఉందన్న భరోసా ఇస్తున్నారు.  ఒక్క ఫోన్ కాల్ తో కేంద్రం నుంచి పవర్ బోట్లు, వేవీ హెలికాప్టర్ లను రప్పించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వరద ప్రభావిత ప్రాంతాలకు రప్పించారు.  బుడమేరు పొంగి మెరుపు వరద నివాస ప్రాంతాలను ముంచెత్తినా సకాలంలో బాధితులకు సహాయ, పునరావాసాలను కల్పించి చంద్రబాబు సర్కార్ ఆదుకుంది.  
రాష్ట్ర మంత్రులను, తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు, నేతలు సకాలంలో  లోతట్టు ప్రాంతాల పర్యటించి సహాయక చర్యలలో భాగస్వాములయ్యారు. వీటన్నిటినీ విస్మరించి వైసీపీ తన బురద రాజకీయంతో మరో సారి రోత పార్టీగా నిరూపించుకుంది. 

By
en-us Political News

  
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు.
సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.