Publish Date:Apr 25, 2022
యాదాద్రి పేరు మళ్లీ యాదగిరి గుట్టగా మారిందా? అలా కేసీఆరే మార్చేశారా? మళ్లీ పాత పేరుతోనే పిలవనున్నారా? చినజీయర్ స్వామి పెట్టినందుకే యాదాద్రి పేరు వినిపించకుండా చేస్తున్నారా? యాదాద్రి మాదిరే త్వరలో భద్రాద్రి పేరు కూడా మార్చేస్తారా? అంటే అవుననే అంటున్నారు.
అఫీషియల్గా యాదాద్రి పేరు మార్చినట్టు ఇంకా ప్రకటన రాకపోయినా.. తాజాగా సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అధికారిక సమాచారంలో యాదగిరి గుట్టు అంటూనే వివరాలు రిలీజ్ చేశారు. ప్రెస్నోట్లో సైతం యాదగిరి గుట్ట అనే ఉండటం ఆసక్తికరంగా మారింది. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మార్చేయనున్నారని తెలుస్తోంది. అందుకే, ఇన్నాళ్లుగా లేనిది.. ఇప్పుడు కొత్తగా యాదగిరి గుట్ట పేరుతో ముఖ్యమంత్రి పర్యటన సమాచారం ఇవ్వడంపై చర్చ జరుగుతోంది.
యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మార్చడానికి చినజీయర్ కేసీఆర్ మధ్య విభేదాలే కారణమని అంటున్నారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతానికి యాదగిరి గుట్ట అనే పేరు. తెలంగాణ వాసులంతా అలానే పిలుస్తారు. యాదాద్రి అనే పేరు ఇంకా అలవాటు కూడా కాలేదు. చినజీయర్ చెప్పారనే ఏళ్లుగా ఉన్న యాదగిరి గుట్టకు యాదాద్రి అని పేరు పెట్టారు. అలాగే భద్రాచలంను కూడా భద్రాద్రి అని నామకరణం చేసింది కూడా చినజీయరే. ఇన్నాళ్లూ ఆయనతో సీఎం కేసీఆర్ సఖ్యతగా ఉండటంతో కొత్త పేర్లు ఫిక్స్ అయ్యాయి. కానీ, ఇటీవల జీయర్ స్వామిని కేసీఆర్ పక్కనపెట్టేశారు. సమతామూర్తి విగ్రహ సమారోహనం ఎపిసోడ్లో కేసీఆర్ ఇగో హర్ట్ అయింది. అప్పటినుంచీ చినజీయర్ను హర్ట్ చేస్తున్నారు. ఆయన లేకుండానే యాదాద్రి ఆలయ పునరుజ్జీవ కార్యక్రమం జరిగిపోయింది. ఇప్పుడు చినజీయర్ పెట్టిన యాదాద్రి పేరును కూడా మార్చేసి.. మళ్లీ పాత పేరైన యాదగిరి గుట్టగానే ఉంచేయాలని భావిస్తున్నారు. స్థానికులు సైతం యాదాద్రి అంటే అదోలా ఉంది.. యాదగిరి గుట్ట అంటేనే మంచిగుంది అంటున్నారు. ఇక, చినజీయర్ పెట్టిన భద్రాద్రి పేరును కూడా మళ్లీ భద్రాచలం ఆలయంగా మార్చేసే ఆస్కారం ఉందంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yadadri-as-yadagiri-gutta-39-134957.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.