ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి అన్న విషయం బీఏసీ సమావేశం నిర్ణయిస్తుంది. అయితే ఓ పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ పీ అసెంబ్లీ, మండలి సమావేశాల నోటిఫికేషన్ ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. ఈ సమావేశాలలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. రాష్ట్ర విత్తమంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. పలు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సభ ఆమోదం పొందాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది. వీటిలో చట్ట సవరణలకు సంబంధించిన బిల్లులు కూడా ఉంటాయంటున్నారు.
అయితే వీటన్నిటికంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనగానే అందరి ఆసక్తీ ఆ 11 మంది ఎమ్మెల్యేలపైనే ఉంది. ఆ పదకొడు మంది ఎమ్మెల్యేలూ సభకు హాజరౌతారా? డుమ్మా కొడతారా? అన్న ఆసక్తి రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా ఉంది. ఇంతకీ ఆ 11 మంది ఎమ్మెల్యేలూ ఎవరనుకుంటున్నారా... వాళ్లే వైసీపీ ఎమ్మెల్యేలు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మర్యాద ఇవ్వడమే కాదు.. తీసుకోవడమూ రాదని ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వచ్చిన రోజే తేలిపోయింది. గైర్హాజరైతే ఉన్న ఎమ్మెల్యే గిరీ కూడా పోతుందన్న ఒకే ఒక్క కారణంతో ఆయన ఆ రోజు అసెంబ్లీకి వచ్చారు. ఆయన విజ్ణప్తికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు ఆ నాడు జగన్ కు అర్హత లేకపోయినా, ఆయన కారును అసెంబ్లీ గేటు లోపలికి అనుమతించారు. అక్షర క్రమంతో సంబంధం లేకుండా ముందుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. అయినా ఆ మర్యాద, గౌరవం నిలబెట్టుకోవడం తెలియని జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ఇలా ప్రమాణ స్వీకారం చేసి.. అలా వెళ్లిపోయారు. కనీసం తన పార్టీ సభ్యుల ప్రమాణ స్వీకారం వరకూ కూడా కూర్చోలేదు. పోనీ అది పక్కన పెట్టినా.. మంత్రుల కంటే ముందు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వలేదంటూ.. బయటకు వెళ్లి విమర్శలు గుప్పించారు. దీనిని బట్టే ఆయనకు అసెంబ్లీలో కూర్చునే ఉద్దేశం లేదని అవగతమైపోతున్నది.
రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై హస్తిన వెళ్లి మరీ ధర్నా చేసి వచ్చిన జగన్.. అదే సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారన్న ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం ఉందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి జగన్ రెడ్డికి అసెంబ్లీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారా, డుమ్మా కొడతారా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-jagan-atted-assembly-39-187900.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది