పిన్నెల్లి విధ్వంసం చూసిన తరువాతా ఈసీ కళ్లు తెరవదా?

Publish Date:May 22, 2024

Advertisement

మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ఆయన ఒక పోలింగ్ బూత్ లో ఈవీఎమ్ ధ్వంసం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన తరువాత మాత్రమే ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. పూర్తి స్థాయి వెబ్ కాస్టింగ్ అమలు చేసిన నియోజకవర్గాలలో పిన్నెల్లి పోటీ చేసిన మాచర్ల నియోజకవర్గం కూడా ఒకటి. అయినా ఆయన ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై పోలింగ్ ముగిసిన పది రోజులకు గానీ, అదీ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సిట్ నివేదిక తరువాత మాత్రమే ఆయనపై కేసు బుక్కైంది. చర్యలు తీసుకోవాలన్న ఈసీ ఆదేశాలపై పోలీసులు ఎలా ముందుకు కదులుతారో చూడాలి. హౌస్ అరెస్టు నుంచి సునాయాసంగా పరారైపోయిన పిన్నెళ్లి.. హైదరాబాద్ లో ఉన్నట్లు తెలియసేసినా పోలీసులు ఆయనను తిరిగి తీసుకువచ్చి హౌస్ అరెస్టులో ఉంచే దిశగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. 

మాచర్లలో పోలీసులు, అధికారయంత్రాంగం అంతగా  పిన్నెల్లితో అంటకాగి విధ్వంసం ద్వారా ఓటింగ్ ప్రక్రియకు ఆటంకాలు కలిగించి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి లేకుండా చేయడానికి ఎంత చేయాలో అంత చేసినా.. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. నియోజకవర్గంలో ఆయన ఎంత వ్యతిరేకత మూటగట్టుకున్నారో ఇట్టే అర్ధం అవుతుంది.  

అయినా పోలింగ్ బూత్ లోకి చొరబడి, అక్కడి సిబ్బందిని బెదరించి ఈవీఎంను ధ్వంసం చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఈసీ ఇప్పటి వరకూ చర్య ఎందుకు తీసుకోలేదో అర్ధం కాదు. వాస్తవానికి ఆయనపై అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. తమ వైఫల్యానికి సిగ్గుపడి పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలవంచుకోవాలి.   
ఇక్కడ ఈసీ వైఫల్యాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ కు ముందు నుంచీ కూడా విపక్ష కూటమి నేతలు ఏపీలో శాంతి భద్రతల గురించి ఫిర్యాదులు చేసినప్పటికీ తక్షణ  చర్యలు తీసుకోకుండా పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు ఇన్  చార్జి డీజీపీని బదిలీ చేసి ఈసీ సాధించింది శూన్యమని పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనతో తేలిపోయింది.

ఇప్పటికీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బుట్టదాఖలు చేసిన సీఎస్పై చర్యలే లేవు. పోలింగ్ రోజున భారీ హింస ఒకెత్తయితే.. కౌంటింగ్ రోజు అంతకు మించి హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా భద్రత పెంపునకు, అదనపు బలగాల మోహరింపునకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే సీఎస్ ను మార్చకుండా భద్రతా ఏర్పాట్లు చేసినా పెద్దగా ఫలితం ఉండదని, కొత్త డీజీపీ వచ్చిన తరువాత కూడా అధికార పార్టీకి అనుకూలంగా పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు చూసిన ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. మరి ఈ విషయంలో ఈసీ ఎందుకు స్పందించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.  

By
en-us Political News

  
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.