కోహ్లీ ఉద్వాసనకు రంగం సిద్ధం..?

Publish Date:Jul 7, 2022

Advertisement

దేశంలో క్రికెట్ ఉన్న ఆదరణ ఎంత అన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ స్టార్లకు సినీమా స్టార్లతో సమానంగా అభిమానులు ఉన్నారు. అయితే దేశ రాజకీయాలలో ఎన్నిపార్టీలూ, ఆ పార్టీలలో గ్రూపులూ లాగే క్రికెట్ రాజకీయాలలో కూడా అంతకు మించి ఉన్నాయనడంలో సందేహం లేదు. రాణిస్తున్న క్రీడాకారుడిని కిందకు లాగేయడంలో.. విఫలమౌతున్న ఆటగాడిని అందలం ఎక్కించడానికి అవకాశాలు ఇవ్వడంలో ఈ రాజకీయాలదే కీలక పాత్ర. దేశంలో దిగ్గజ క్రికెటర్లకు కొదవ లేదు. అయితే అటువంటి వారికి అవకాశాలు దక్కే విషయంలో మాత్రం క్రికెట్ రాజకీయాలదే పెత్తనం. క్రికెట్ రాజకీయాల కారణంగా ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లు కనుమరుగైపోయారు. 1983 లో భారత్ తొలి ప్రపంచ కప్ విజయంలో నాడు జట్టులో ఉన్న ప్రతి ఆటగాడూ కీలకమే. అయితే కెప్టెన్ కపిల్ దేవ్ తరువాత అంతటి ప్రముఖ భూమిక పోషించి.. ఫైనల్స్ లో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచిన ఆల్ రౌండర్ మోహిందర్ అమర్ నాథ్ సరైన అవకాశాలు లభించక కనుమరుగైన సంగతి క్రికెట్ ను ఫాలో అయ్యే ఎవరూ మరచిపోలేరు. ఆగ్రహం పట్టలేక ఒక సందర్భంగా మోహిందర్ అమర్ నాథ్ భారత క్రికెట్ సెలక్షన్ కమిటీని  ‘బంచ్ ఆఫ్ జోకర్లు’ అంటూ విమర్శించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తరువాత కూడా క్రికెట్ రాజకీయాల కారణంగా ఇబ్బందులు పడిన ప్రతిభావంతులైన క్రికెటర్లు, ఒత్తిడికి లోనై ఫామ్ కోల్పోయిన క్రీడాకారులూ ఉన్నారు. ముఖ్యంగా భారత క్రికెట్ లో బ్యాటింగ్ ఆణిముత్యం అయిన సునీల్ గావస్కర్ సెంచరీల వరల్డ్ రికార్డుకు ముందు క్రికెట్ రాజకీయాల కారణంగా ఎంత ఒత్తిడికి గురైనదీ తెలిసిందే.

అనవసర విమర్శలు, కామెంట్లతో తీవ్ర ఒత్తిడికి గురైన గావస్కర్ ఫామ్ కోల్పోయాడు. ఒక దశలో ఆయన 30వ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సాధించకుండానే ఉద్వాసనకు గురౌతాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నిటినీ అధిగమించి గావస్కర్ ముందుకు సాగి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గావస్కర్ తరువాత క్రికెట్ దేవుడిగా అభిమానుల నీరాజనాలు అందుకున్న సచిన్ టెండూల్కర్ కూడా క్రికెట్ రాజకీయాల కారణంగా ఇబ్బందులు పడ్డాడు, ఒత్తిడికి గురయ్యాడు. ఫామ్ కోల్పోయి బాధపడ్డాడు. వాటిని అధిగమించాడనుకోండి అది వేరే సంగతి.

కానీ క్రికెట్ రాజకీయాలు ఎంతటి వారినైనా, ఎంతటి ప్రతిభావంతుడినైనా కుంగుబాటుకు గురయ్యేంతగా ఇబ్బందులు పెడతాయనడానికి తాజా ఉదాహరణ కింగ్ విరాట్ కోహ్లీ. తన సంచలన ఇన్నింగ్స్ తో భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన విరాట్ కోహ్లీ ప్రస్థుతం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. పామ్ కోల్పోవడమన్నది ఏ క్రికెటర్ కయినా కెరీర్ లో అతి సహజంగా ఎదురయ్యే ఇబ్బంది. అది తాత్కాలికం. క్రికెటర్ టెక్నిక్ శాశ్వతం.  అద్భుతమైన టెక్నిక్ ఉన్న కోహ్లీ ఫామ్ లేమితో సతమతమౌతున్న సమయంలో క్రికెట్ రాజకీయం అతడిని మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. సాధనపై దృష్టి కేంద్రీకరించి ఫామ్ ను దొరకబుచ్చుకునే అవకాశం లేకుండా ఒత్తిడి పెంచుతోంది. కరోనా కారణంగా అసలు క్రికెట్ పోటీలే జరగని రెండేళ్ల కాలాన్నీ కూడా కలుపుకుని ఇన్నేళ్ల నుంచీ పరుగులు చేయడంలేదు. పరుగుల యంత్రం సర్వీస్ అయిపోయిందంటూ బీసీసీఐలోని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు కోహ్లీమీద ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి.

సహజంగా దూకుడుతో ఆడే కోహ్లీ ఒత్తిడి కారణంగా దూకుడు ప్రదర్శించలేకపోతున్నాడు. ఫామ్ లేమిని సాకుగా చూపి జట్టునుంచి అతడికి ఉద్వాసన పలికేందుకు క్రికెట్ రాజకీయం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తొలుత దక్షిణాఫ్రికా పర్యటనకు విశ్రాంతి పేరుతో కోహ్లీని దూరం చేశారు.

ఇప్పుడు ఈ నెలలో టీమ్ ఇండియా విండీస్ టూర్ కు కూడా పక్కన పెట్టే యోచన చేస్తున్నారు. ఒక దిగ్గజ ఆటగాడు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు అతడికి సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశం ఇవ్వడం ద్వారా ఫామ్ ను దొరకబుచ్చుకునేందుకు సహకరించాల్సిన క్రికెట్ సెలక్షన్ కమిటీ.. బీసీసీఐ అందుకు భిన్నంగా వ్యవహరించడం విచారకరం. గతంలో గంగూలీ అర్ధంతరంగా తన కెరీర్ ను ముగించేయడానికి కూడా ఇదే కారణం. కోచ్ గ్రెగ్ చాపెల్ తో కలిసి బీసీసీఐ చేసిన రాజకీయమే గంగూలీ తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పడానికి కారణమన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కోహ్లీ విషయంలో కూడా బీసీసీఐ అదే పంథాలో నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.