పిల్లలతో తల్లిదండ్రుల సంభాషణ ఎందుకంత ముఖ్యం.

Publish Date:Dec 5, 2023

Advertisement

నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. పిల్లల గురించి ఎవరైనా ఏదైనా వాక్యం చెప్పమంటే మొదట ఇదే చెబుతారు. ఆ తరువాత పిల్లల్లో దేవుడుంటాడని కూడా చెబుతారు. పిల్లలు పుట్టినప్పుడు చాలా అపురూపంగా చూసుకుంటాం. ఏడుస్తుంటే ఆకలేస్తుందేమో అని కంగారు పడతాం.  స్థోమతను బట్టి మంచి మంచి బట్టలు వేసి వారిని చూసి మురిసిపోతాం. బొమ్మలు కొనివ్వడం నుండి అడిగిన దానికల్లా తల ఊపుతాం. వారిని అంత ప్రేమగా పెంచి.. మూడు నాలుగేళ్లు నిండగానే ఇక వారి గురించి అంతగా పట్టించుకోవడం మానేస్తాం. చాలా మంది ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకు అన్నీ ఇస్తున్నాం, అన్నీ సమకూరుస్తున్నాం, లోటు చేయడం లేదు కదా అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పని, వారికి అడిగిందల్లా ఇవ్వడం కాదు ప్రేమను పంచాలని, పసి మనసుల్లో బరువు దించాలని, వారితో మాట్లాడాలని పిల్లల మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, కౌన్సెలింగ్ నిపుణులు చెబుతున్నారు.

పిల్లలతో తల్లిదండ్రుల అనుబంధం ఎలా ఉండాలి?

 పిల్లలకు కావాల్సిందేమిటి? పిల్లలతో సంభాషణ ఎందుకంత ముఖ్యం?  వంటి  విషయాల గురించి చర్చించేందుకు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య బంధాన్ని దృఢంగా మార్చేందుకు ప్రతి ఏడాది డిసెంబర్ 5 వ తేదీన పిల్లలతో సంభాషణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని ప్రకారం పిల్లలతో తల్లిదండ్రులకు ఉండాల్సిన అనుబంధం గురించి మరింత అవగాహన కల్పిస్తారు. బిజీ జీవితాలు గడిపే తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా చేతులారా వైఫల్యాలకు గురిచేస్తారో వారికర్థమయ్యేలా చెప్పడం, పిల్లల విషయంలో వారు ఎలా ఉండాలో తెలియజేయడం, వారి మనసు పొరల్లో ఉన్న సందేహాలు, భయాలు, అపోహలను నివృత్తి చేయడం ఈరోజు ఉద్దేశం.

పిల్లలతో ఎందుకు మాట్లాడాలి?

తల్లిదండ్రులు పిల్లలను గొప్పగా పెంచాలని అనుకుంటారు. అందుకోసమే బోలెడంత డబ్బు ఖర్చు చేస్తారు. నిజానికి పిల్లలకోసం డబ్బు ఖర్చు చేయడం కాదు, వారితో మాట్లాడితే పిల్లలు జీవితంలో విజయం సాధిస్తారు. ఉత్తమ పౌరులుగా  మారుతారు. ఎందుకంటే సంభాషణలోనే వారి భవిష్యత్తు నిర్మాణమవుతుంది. పిల్లలతో మాట్లాడే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య అనుబంధం చాలా దగ్గరగా, స్నేహభావంతో ఉంటుంది. పిల్లలు కొన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడతారు. కొన్ని చెబితే ఏమనుకుంటారో అని సందేహంతో ఉంటారు. కొన్ని విషయాలు అడిగితే తల్లిదండ్రులు కోపం చేసుకుంటారేమో అని చెప్పలేరు.

తల్లిదండ్రులు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం. వాళ్లు రక్తం పంచుకుపుట్టిన పిల్లలు. వారికంటే బయటి ప్రపంచం, డబ్బు, విలాసాలు ఏవీ ముఖ్యం కాదు.  అందుకే వారితో మాట్లాడుతుంటే తల్లిదండ్రులే తమకు గొప్ప స్నేహితులు అని భావిస్తారు.

పిల్లలతో ఏం మాట్లాడాలి?

పిల్లలతో ఏం మాట్లాడాలనే డైలమా చాలామంది తల్లిదండ్రులలో ఉంటుంది. అయితే పిల్లతో మాట్లాడటానికి వారిలో పరిణితి పెంచడానికి, వారిని ఆలోచించేలా చెయ్యడానికి చాలా అంశాలున్నాయి.

పిల్లలు ఇంట్లో,  స్కూల్ నుండి రాగానే, స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు. చాలా  సందర్బాలలో బోలెడు అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటారు.

పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారు ఏ విషయాల మీద ఎక్కువ ఆసక్తిగా ఉన్నారో గమనించాలి. వాటి గురించి పిల్లలతో మాట్లాడాలి. అందులో తప్పొప్పులు వారితో చర్చించాలి. దీనివల్ల పిల్లలో ఆలోచనా సామర్థ్యం, అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

 చాలామంది తల్లిదండ్రులు  పిల్లలు స్కల్ నుండి పిల్లలు ఇంటికి రాగానే.. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది అని అడుగుతారు. పిల్లలు కూడా చాలావరకు అల్లరి చేయడం స్కూల్లో పనిష్మెంట్ కు గురికావడం జరుగుతూ ఉంటుంది. ఈ  విషయం చెప్పేటప్పుడు పిల్లలు నిరాశగా, బాధగా ఉంటారు. అదే ఈ ప్రశ్న కాకుండా వేరే ప్రశ్నలు అడిగితే పిల్లలు సంతోషిస్తారు. ఎంతో ఉత్సాహాంతో తల్లిదండ్రులతో మాట్లాడతారు. ఈరోజు స్కూల్లో ఏ పని బాగా చేశావనో..  క్లాసులో జరిగిన సరదా సంఘటన ఏంటనో.. అడగాలి. ఇవే కాకుండా.. ఏ సబ్జెక్ట్ కష్టంగా అనిపించిందని, మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఎలా ఉందని కూడా అడగచ్చు. వీటి వల్ల పిల్లలు సంతోషంగా సమాధానాలు ఇస్తారు. పిల్లలను నొప్పించిన సంఘటనలు ఏవైనా ఉన్నా నోరువిప్పి చెబుతారు.  దానివల్ల పిల్లలకు ఏ విషయాన్ని దాపరికం లేకుండా చెప్పడం అలవాటు  అవుతుంది.

స్నేహితుల గురించి, స్నేహితులతో జరిగే సంఘటనల గురించి వారితో సాన్నిత్యం, గొడవలు మొదలైనవన్నీ అడగాలి. ఎవరు బాగా స్నేహంగా ఉంటారో, వారు ఎలా చదువుతారో, వారు ఎలాంటి వారో అడిగి తెలుసుకుంటూ ఉంటే స్నేహం వల్ల పిల్లలు తప్పు దారిలో వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడవచ్చు.

పిల్లలు తప్పు చేస్తే ఎప్పుడూ దండించకూడదు. వాటికి తగిన ఉదాహరణలు చెబుతూ వారు చేస్తున్న తప్పుల వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వివరించాలి. అంతే..  పిల్లలు ఆ తరువాత ఎప్పుడూ తప్పు చెయ్యలేరు. దగ్గర కూర్చుని చెప్పే మాటలు మనసును తాకుతాయి. అదే కోపంగా చెప్పేమాటలు వారి అహాన్ని దెబ్బ కొడతాయి. అందుకే కోపంతో ఎప్పుడూ ఏదీ చెప్పకూడదు. అది భయాన్ని పెంచుతుందే కానీ వారి మనసును మార్చదు.

                                         *నిశ్శబ్ద.

 

By
en-us Political News

  
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు...
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.