మహిళా రిజర్వేషన్లు 33 శాతమే ఎందుకు?

Publish Date:Apr 17, 2026

Advertisement

హిస్టరీ ఆఫ్ మహిళా బిల్లు.. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోంది? ఇప్పటి వరకూ జరిగిన మలుపులేంటి? ప్రస్తుత పరిస్థితేంటి? మహిళా బిల్లు వల్ల వచ్చే లాభాలేంటి? ప్రపంచంలో ఇప్పటి వరకూ ఉన్న రిజర్వేషన్లేంటి? ఈ బిల్లు ద్వారా రాబోయే మార్పు చేర్పులేంటి? అసలు ముప్పై మూడు శాతం ఎందుకు? అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

మహిళా రిజర్వేషన్ బిల్లు-నారీ శక్తి వందన్ అధినియం అనేది భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి. దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల  పోరాటం  ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది. ఆ తరువాత మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల విషయంలో పదే పదే ప్రయత్నాలు జరిగాయి.     1998, 1999, 2002, 2003 సంవత్సరాల్లో వాజ్‌పేయి ప్రభుత్వం ఈ దిశగా ముందుకు సాగాలని ప్రయత్నించినా ఏకాభిప్రాయం కుదరక సాధ్యం కాలేదు. 

మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ లోక్‌సభలో ప్రవేశపెట్టేలోపే ప్రభుత్వం మారడం, ఇతర కారణాలతో మళ్లీ అటకెక్కింది.  సెప్టెంబర్ 2023లో ప్రధాని మోదీ ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినియం-106వ రాజ్యాంగ సవరణ పేరుతో దీనిని ప్రవేశపెట్టి, ఉభయ సభల్లోనూ భారీ మెజారిటీతో ఆమోదింపజేసింది.

ఈ చట్టం అమలులోకి వస్తే భారత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని అంటారు విశ్లేషకులు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలు, ఢిల్లీ అసెంబ్లీలో మహిళలకు మూడింట ఒక వంతు అంటే 33శాతం సీట్లు కేటాయించబడతాయి. ఇప్పటికే ఉన్న  ఎస్సీఎస్టీ రిజర్వేషన్లలో కూడా 33శాతం సీట్లు ఆయా వర్గాల మహిళలకే కేటాయిస్తారు. ప్రతి లోక్‌సభ ఎన్నికల తర్వాత మహిళలకు కేటాయించిన నియోజకవర్గాలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ రిజర్వేషన్ 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంటు దీనిని పొడిగించవచ్చు.

ఈ బిల్లు చట్టంగా మారినప్పటికీ, ఇది వెంటనే అమల్లోకి రాదు. దీనికి రెండు ప్రధాన అడ్డంకులు ఉన్నాయి. ఒకటి జనగణన. దేశవ్యాప్తంగా జనాభా గణన జరగాలి. రెండు నియోజకవర్గాల పునర్విభజన. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలి.  2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. కాబట్టి, 2029 సాధారణ ఎన్నికల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

మహిళా బిల్లు వల్ల లాభాలేంటి? అని చూస్తే.. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగడం వల్ల మహిళా సమస్యలు, భద్రత మరియు విద్యపై మరింత సమర్థవంతమైన చట్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాదు.. లింగ సమానత్వం కూడా లభిస్తుంది. ప్రస్తుతం లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 15 శాతం లోపే ఉంది. ఇది 33 శాతం కి పెరిగితే రాజకీయాల్లో లింగ వివక్ష తగ్గుతుంది. ఇప్పటికే పంచాయతీల్లో ఉన్న  రిజర్వేషన్ల వల్ల గ్రామీణ స్థాయిలో మహిళా నాయకత్వం పెరిగింది. ఇప్పుడు అది జాతీయ స్థాయికి విస్తరిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి? అని పరిశీలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా మహిళా ప్రాతినిధ్యంలో భారత్ ప్రస్తుతం వెనుకబడి ఉంది. ఏకంగా 140వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా 61 శాతం పైగా మహిళా ఎంపీలు ఉన్న దేశం రువాండ. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక మెక్సికో,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  దేశాల్లో యాభై శాతం మహిళా ప్రాతినిథ్యం కనిపిస్తోంది. ఇక స్వీడన్ నార్వే వంటి దేశాల్లో అధికారిక రిజర్వేషన్లు లేక పోయినా.. రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తాయి. ఈ బిల్లు అమలు కావడంతో భారత్ లో కూడా ప్రపంచ దేశాల సరసన భారత్ సైతం అగ్రస్థానంలో నిలిచే అవకాశముంది.

ఇంతకీ మహిళా రిజర్వేషన్లు 33 శాతం ఎందుకు? అంటే..  అందుకంటూ ఒక కారణమైతే లేదు. కానీ రాజ్యాంగపరమైన రాజకీయ సామాజిక సమీకరణాల కలయిక అయితే కనిపిస్తోంది. దీని వెనకున్న మెయిన్ రీజన్ ఏంటంటే.. ప్రస్తుతం భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కలిపి దాదాపు 49.5శాతం వరకూ ఉన్నాయి. ఈ కోటాకు భంగం కలగకుండా ఉండాలంటే, మహిళలకు ప్రత్యేకంగా ఎక్కువ శాతం కేటాయించడం చట్టపరంగా ఇబ్బంది అవుతుందని భావించారు. అందుకే 33 శాతం అనేది ఒక మధ్యస్థమైన, ఆమోదయోగ్యమైన సంఖ్యగా నిర్ణయించారు.

రాజకీయ పరిశీలకుల ప్రకారం..  ఒక సమూహం నిర్ణయాల్లో ప్రభావం చూపించాలంటే వారు కనీసం 30 నుంచి 33 శాతం ఉండాలి. దీనినే క్రిటికల్ మాస్ అంటారు. పది మంది ఉన్న చోట ఒక్క మహిళ ఉంటే ఆమె గొంతు నొక్కేసే అవకాశం ఉంటుంది. కానీ పది మందిలో ముగ్గురు ఉంటే, వారు ఒక బలమైన గొంతుకగా మారి చట్టాలను మార్చే శక్తిని పొందుతారు. అందుకే కనీస ప్రాతినిధ్యం కోసం ఈ శాతాన్ని ఎంచుకున్నారు.

భారతదేశంలో 1993లో తెచ్చిన 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించారు. అక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, అదే సూత్రాన్ని పార్లమెంటు మరియు అసెంబ్లీలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు ఈ కోటాను 50 శాతానికి పెంచాయి, కానీ జాతీయ స్థాయిలో   33 శాతం తోనే ప్రారంభించారు.

1996 నుంచి వివిధ ప్రభుత్వాలు ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, 33 శాతానికి మించి రిజర్వేషన్ ఇస్తే ఇతర వర్గాల నుంచి.. ముఖ్యంగా పురుష ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని భావించారు. అందరినీ ఒప్పించడానికి ఈ 33 శాతం అనేది ఒక ఫార్ములాగా మారింది. చాలామంది మహిళలు జనాభాలో 50 శాతం ఉన్నారు కదా, కోటా కూడా 50 శాతం ఉండాలి కదా? అని ప్రశ్నిస్తారు. అది న్యాయమైన వాదన అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ పరిమితుల దృష్ట్యా 33 శాతాన్ని మొదటి అడుగుగా వేస్తున్నారు. భవిష్యత్తులో మహిళా ప్రాతినిధ్యం పెరిగే కొద్దీ ఈ శాతాన్ని సవరించే అవకాశం కూడా ఉండవచ్చు.

By
en-us Political News

  
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.