వైసీపీకి కార్యకర్తలు ఏరీ.. ఎక్కడ?

Publish Date:Nov 28, 2023

Advertisement

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి  ఇప్పుడు కార్యకర్తలు కూడా దూరం అయ్యారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ పలుమార్లు నేతల చేత పలికించినా.. ఏపీకి జగనే మళ్ళీ ఎందుకు కావాలని ఊదర గొట్టినా ప్రజల నుండి స్పందన కరువైంది.  వైసీపీ సభలు, సమావేశాలలో ఖాళీ కుర్చీలను చూస్తేనే ఇది అర్ధమైపోతున్నది. నిత్యం ప్రజల మధ్యనే ఉండాలని పార్టీ అధిష్టానం ఎన్నిసార్లు ఎన్ని ప్రణాళికలు వేసి మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పినా ఏదో తూతూ మంత్రంగానే మb అనిపిస్తున్నారు తప్ప పార్టీలో ఉత్సాహం నింపేలా ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో పూర్తిగా విఫలమౌతున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మన సంక్షేమం అందింది.. ఆ విషయాన్ని మీరే వెళ్లి ప్రజలకు చెప్పాలని పార్టీ పెద్దలు ద్వితీయ శ్రేణి నాయకులకు ఎన్నిసార్లు హితబోధ చేసినా వారు అడుగు ముందుకు వేయడానికి సుముఖంగా లేరు.  ఎన్నికలేమో దగ్గరకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ సొంత సర్వేల నుండి వివిధ మీడియా సంస్థల సర్వేల వరకూ ఎక్కువ శాతం వైసీపీ పరిస్థితి మునిగిపోయే నావేనని తేల్చిసిన పరిస్థితి.  మార్చి మొదటి వారంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగానైనా తేల్చేసింది.  

నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో సంక్షేమం అంటు బటన్ నొక్కుడం వినా మరో పని చేసిన పాపాన పోలేదు.  అదే ఇప్పుడు వైసీపీ కొంప ముంచే పరిస్థితి తెచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ అధికార పీఠం ఎక్కాక సమయం గడిచే కొద్దీ ఒక్కో వర్గంలో అసంతృప్తి మొదలై పెరుగుతూ వచ్చింది. ఆయన హయాంలో రాష్ట్రంలో దాదాపు అన్ని రంగాలూ నిర్వీర్యం అయిపోయాయి. ఇదిగో మా ప్రభుత్వంలో ఈ రంగాన్ని మెరుగు పరిచాం..   సాధించిన అభివృద్ధి ఇదీ అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది.  అసలు రాష్ట్రానికి భారీ ఆదాయం తెచ్చిపెట్టే నిర్మాణ, రియల్ ఎస్టేట్, తయారీ , ఫార్మా రంగాలు పూర్తిగా కుదేలైపోయాయి. రోడ్లు, రహదారులు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు, త్రాగు సాగు నీటి ప్రాజెక్టులు లాంటి మౌలిక సదుపాయాలను అంతో ఇంతో మెరుగు పరచాల్సి ఉన్నా అసలు వాటిని పట్టించుకోకపోవడంతో అవీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిపై ప్రజల నుండి ఎన్నిసార్లు ప్రశ్నలు ఎదురైనా ప్రభుత్వం మాత్రం అన్నిటికీ బటన్ నొక్కుడే సమాధానంగా చూపించింది. మంత్రులూ, నేతలూ ప్రజలను బటన్ నొక్కి సొమ్ములిస్తున్నారుగా.. ఇక మాట్లాడకండి అంటూ ప్రజలను గదమాయించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. పెన్షన్ వదులు కుంటే రోడ్లు వేయిస్తామని కూడా చెప్పారంటే జగన్ హయాంలో పాలన ఎంతగా పడకేసిందో అర్ధం చేసుకోవచ్చు.

జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగం వంటివి భూతద్దం పెట్టి వెతికినా కానరాని పరిస్థితి ఏర్పడింది. పెరిగిన పన్నులతో ప్రజల జేబులు గుల్లయ్యాయి.    సంక్షేమం అంటూ పందేరం చేసిన సొమ్ములన్నీ ఏదో రూపేనా ప్రభుత్వం ముక్కుపిండి మరీ వసూలు చేసింది. మళ్ళీ ఆ సొమ్ములనే  బటన్ నొక్కి పందేరం చేసినట్లుగా ప్రచారం చేసుకుంటూ జగన్ సర్కార్ ఇప్పటి వరకూ పబ్బం గడిపింది. పైగా దొరికిన ప్రతి దాన్ని తాకట్టు పెట్టేసి చేసిన అప్పు, అప్పనంగా అమ్మేసి సొమ్ము చేసుకున్న నిధులు ఏమయ్యాయి.. వాటిని ఏ అభివృద్ధి కోసం ఖర్చు చేశారన్నది ఎవరికీ అంతు చిక్కని అంశంగా మారిపోయింది. 

ఫలితంగా ఇప్పుడు ప్రజలలో వైసీపీపై అసంతృప్తి పెరిగిపోయింది. ఎంతటి కరుడుగట్టిన పార్టీ కార్యకర్తకైనా ఒక క్షణంలో తన భవిష్యత్తుపై ఆలోచన వస్తుంది. ఆ క్షణాన తడిమి చూసుకుంటే తన పార్టీ వలన ప్రయోజనం శూన్యం అన్నప్పుడు తనకు తెలియకుండానే జెండా కింద పడేస్తాడు. సరిగ్గా వైసీపీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నది. అందుకే గత ఎన్నికలలో పార్టీ విజయం కోసం జెండా మోసిన కార్యకర్తలే ఇప్పుడు వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు.  మహా మహులైన నాయకులు అనుకున్న వారు, మంత్రులుగా చక్రం తిప్పిన వారికి సైతం ప్రభుత్వ అసంతృప్తి సెగ తాకుతున్నది. సొంత అడ్డా పులివెందులలో జగన్ కూడా నిరసనలను ఎదుర్కొన్నారంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అవగతం అవుతున్నది. అందుకే పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కూడా వైసీపీకి కార్యకర్తలు అనేవారు లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తున్నది. ఇదే వైసీపీని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఓటమి భయాన్ని పరిచయం చేస్తున్నది.  

By
en-us Political News

  
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.