సంక్షేమ పథకాల రీ ఇంజనీరింగ్ జరగాలి!

Publish Date:Feb 13, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం (ఫిబ్రవరి 14) అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కేటాయింపులు,  అభివృద్ధి, సంక్షేమం తదితర అంశాలపై తెలుగువన్ ఎండీ కంఠం నేని రవిశంకర్, సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ తో  వాస్తవ వేదిక వేదికగా చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ సారాంశం ఇంది. 

పీవీ రమేష్ 1985 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా,  ఆరోగ్య శాఖ  కార్యదర్శిగా  పనిచేశారు. అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి,ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్  వంటి సంస్థల్లో అత్యున్నత స్థాయి పదవులలో పని చేసిన అనుభవం ఆయన సొంతం.  ఆయన కెరీర్ మొత్తంలో నిబంధనల గీత దాటకుండా నిజాయితీగా, నిష్కర్షగా వ్యవహరించారు. తన పరిధిలోనిది కాని పని చేయాల్సి వస్తే సీఎం అయినా సరే ఎలాంటి శషబిషలూ, మొహమాటాలూ లేకుండా ఇది సాధ్యం కాదు సార్ అని చెప్పగలిగిన స్థైర్యం, ధైర్యం ఆయన సొంతం. అటువంటి డాక్టర్ పీవీ రమేష్ బడ్జెట్ అంటే ఏమిటి?  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల పరిమితి, పాపులిజం వల్ల ఎదురయ్యే విపరిణామాలను విపులంగా వివరించారు.  
పోటీలు పడి మరీ ఓట్ల కోసం డబ్బులు పంచుకుంటూ పోతే ఏపీ దివాళా తీస్తుందని హెచ్చరించారు. ఎన్నికల హామీల అమలు అంటూ  కేటాయింపులు చేయడం వల్ల బడ్జెట్ మొత్తం సంక్షేమ పథకాలకే సరిపోతోందన్న పీవీ రమేష్ దీని వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించారు.   రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ప్రకారం, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అప్పులు చేయకూడదు.  15వ ఆర్థిక సంఘం వరకు రాష్ట్రాలు తమ జిఎస్‌డిపి  లో 3.5% వరకు అప్పు తీసుకోవచ్చు. అయితే 16వ ఆర్థిక సంఘం దీనిని మూడు శాతానికి తగ్గించింది.   రాష్ట్ర విభజనకు ముందు వరకూ  అప్పులు 2.5% కంటే తక్కువగా ఉండేవన్న ఆయన అప్పట్లో రెవెన్యూ సర్ ప్లస్ ఉండేదని వివరించారు. అయితే  ప్రస్తుతం రాష్ట్రం తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రభుత్వం నేరుగా చేసే అప్పులే కాకుండా కార్పొరేషన్ల ద్వారా చేసే బడ్జెటేతర అప్పులు  ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయన్నారు. 

ఇక సాధారణంగా ఖర్చు పెట్టే డబ్బు వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఆదాయం వస్తుంది? ప్రజల జీవన ప్రమాణాలు ఏమేరకు పెరుగుతాయి అన్నది హేతువుగా ఉండాలన్న పీవీ రమేష్.. ప్రస్తుత ప్రభుత్వాలు మాత్రం అటువంటి విషయాలపై దృష్టి పెట్టకుండా, రాజకీయ లబ్ధే లక్ష్యంగా సొమ్ముల పందేరానికే ప్రాధాన్యత ఇస్తున్నారని పీవీ రమేష్ అన్నారు.   పోలవరం వంటి కీలక ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఖర్చు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో  30 శాతానికి పైగా పిల్లలు పోషకాహార లోపం, 50 శాతం మంది  మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వీటన్నిటికీ బడ్జెట్ లో పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచాలంటే..  ఉన్న అప్పులు ఎంత, ఆర్థిక పరిస్థితి ఏమిటి అనే  వాటి విషయంలో పారదర్శకత పాటించి సవరించుకోవాలన్నారు.   ఎక్కువ వడ్డీకి తీసుకున్న అప్పులను తక్కువ వడ్డీకి మార్చుకునే మార్గాలను అన్వేషించాలి. సంక్షేమ పథకాలను అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలి. తల్లికి వందనం వంటి పథకాలను ధనికులకు కూడా వర్తింప చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.  విద్య, వైద్యం,   పోషకాహారం వంటి వాటిపై పై పెట్టుబడి పెట్టాలన్నారు.  ప్రతి పథకాన్ని మళ్ళీ సమీక్షించి, దాని వల్ల ఎవరికి ఉపయోగం ఉందో చూసి రీ-ఇంజనీరింగ్ చేయాలని డాక్టర్ పీవీ రమేష్ అన్నారు. 

డాక్టర్ పీవీ రమేష్ తో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో  వీక్షించండి.

 

By
en-us Political News

  
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.